తెలంగాణ

telangana

ETV Bharat / state

4th Day of Telangana Decade Celebrations : 'దేశానికే దారిచూపే.. టార్చ్‌ బేరర్‌గా తెలంగాణ'

Telangana Formation day 2023 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు.. విద్యుత్‌ ప్రగతి సంబరాలు అంబరాన్నంటాయి. చిమ్మ చీకట్లు చీల్చుకుంటూ.. అద్భుత పురోగతితో దేశానికే దారిచూపే.. టార్చ్‌ బేరర్‌గా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

By

Published : Jun 5, 2023, 8:03 PM IST

Updated : Jun 5, 2023, 9:47 PM IST

4th Day of Telangana Decade Celebrations 2023
4th Day of Telangana Decade Celebrations 2023

'దేశానికే దారిచూపే.. టార్చ్‌ బేరర్‌గా తెలంగాణ'

Power day in Telangana Formation day celebrations : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా.. విద్యుత్‌ ప్రగతి సంబరాలను మంత్రులు, ప్రజాప్రతనిధులు ఊరూవాడా సందడిగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, అద్భుత పురోగతితో దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ విద్యుత్ ప్రగతి - నిత్య కోతల నుంచి నిరంతర వెలుగులకు ప్రస్థానం అంటూ ట్వీట్ చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతోందని పేర్కొన్నారు. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నట్లు చెప్పారు.

విద్యుత్ సౌధలో దశాబ్ది ఉత్సవాలు :విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో విద్యుత్‌ శాఖ నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. దేశ సగటు విద్యుత్ వినియోగం కంటే.. రాష్ట్ర సగటు విద్యుత్ వినియోగం 70శాతం అధికంగా ఉందని ట్రాన్స్ కో- జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. హైదరాబాద్‌ విద్యుత్ సౌధలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. రాష్ట్ర సగటు విద్యుత్ వినియోగం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందంటూ ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించారు.

Telangana Decade Celebrations : నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ విజయోత్సవ సభలు

విద్యుత్​ సామర్థ్యం పెరిగింది :తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత విద్యుత్​ సామర్థ్యం పెరిగిందని.. సోలార్​ పవర్​ ఉత్పత్తి పెంచారని విద్యుత్​ శాఖ తెలిపింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుందుకు ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తుందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్​ శాఖలో అంతర్గత సామర్థ్యాన్ని పెంచిందని పేర్కొంది. నాలుగో రోజు ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయని తెలిపింది.

"దేశానికే మన రాష్ట్ర విద్యుత్​ వ్యవస్థ దిక్సూచిగా ఉంది. ఉత్పత్తిలో, సరఫరాలో, వినియోగం విషయాల్లో కచ్చితమైన ప్రణాళికలను పాటిస్తున్నాం. విద్యుత్​ ఉత్పత్తి విషయంలో దేశంలోనే అగ్రస్థానాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. రాష్ట్రానికి అనేక పెట్టుబడు వస్తున్నాయంటే దానికి కారణం విద్యుత్​ అభివృద్ధి కూడా ఒక రకమైన కారణం. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రోత్సాహంతో దాదాపు రూ.97 వేల కోట్లు రాష్ట్రానికి విద్యుత్​కు సంబంధించి పెట్టుబడి పెట్టారు. దీనివల్లనే ఈరోజు నాణ్యమైన విద్యుత్​ను అందిస్తున్నాం. 24 గంటలు ప్రజలకు విద్యుత్​ సౌకర్యం కల్పిస్తున్నాం." - ప్రభాకర్‌ రావు, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ

ఇవీ చదవండి :

Last Updated : Jun 5, 2023, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details