తెలంగాణ

telangana

ETV Bharat / state

పౌరసరఫరాల సంస్థకు 37కోట్లు ఆదా

సన్నబియ్యం సరఫరాలో పౌర సరఫరాల సంస్థకు 37కోట్ల రూపాయలు ఆదా కానుంది. గతేడాది సరఫరా చేసిన ధరకే ఈ ఏడాది పంపిణీ చేసేలా రైస్ మిల్లర్లు అంగీకరించారు.

By

Published : Feb 13, 2019, 9:12 PM IST

పౌర సరఫరాల సంస్థ, రైస్​ మిల్లర్ల మధ్య సయోధ్య

పౌర సరఫరాల సంస్థ, రైస్​ మిల్లర్ల మధ్య సయోధ్య
రైస్​మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ అధికారుల మధ్య సయోధ్య కుదిరింది. గత ఏడాది సరఫరా చేసిన ధరకే సన్న బియ్యం అందించడానికి రైస్‌ మిల్లర్లు అంగీకరించారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్‌లో ఆ సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌కు సమ్మతి తెలుపుతూ లేఖ అందజేశారు.

ఏడాదికి 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పాఠశాల విద్యార్థులకు అందిస్తోంది. ఈ బియ్యం కొనుగోలుకు సంబంధించి టెండర్లు నిర్వహించగా తుది రేటు క్వింటాల్‌కు రూ.3,590 కోట్‌ చేశారు. గత ఏడాది సరఫరా చేసిన ధరకే ఈసారి కూడా సరఫరా చేయాలని రైస్‌ మిల్లర్లను ఒప్పించారు. ఫలితంగా పౌర సరఫరాల సంస్థకు రూ. 37 కోట్లు ఆదా కానుంది. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంకోసం సరఫరా చేసే ఈ సన్న బియ్యం నాణ్యత, పరిమాణం విషయంలో పక్కాగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details