తెలంగాణ

telangana

ETV Bharat / state

నిఘానేత్రాల నీడలో నగరం భద్రం..

సీసీ కెమెరాల నిఘాలో నేరాలు నిక్షిప్తం కావడంవల్ల కేసుల ఛేదన మరింత సులువవుతోందని పోలీసులు తెలిపారు. సరూర్​ నగర్​లోని గవర్నమెంట్​ ప్రెస్​ కాలనీలో రెసిడెన్సియల్​ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీల్లో ఏర్పాటు చేసిన  32 సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​, ఎల్బీనగర్​ డీసీపీ సన్​ప్రీత్​సింగ్​ ప్రారంభించారు.

By

Published : Apr 24, 2019, 8:02 PM IST

cc-cameras

నిఘానేత్రంతో నేరగాళ్ల ఆటకట్టించొచ్చని, నేరం జరిగిన వెంటనే నిందితులు పట్టుబడుతున్నారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్ అన్నారు. సరూర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ ప్రెస్ కాలనీ, రెసిడెన్షియల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీల్లో సుమారు రూ.7లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్​తో కలిసి ఆయన ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య తగ్గిందని, ప్రజల సహకారంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

నిఘానేత్రాల నీడలో నగరం భద్రం..

ABOUT THE AUTHOR

...view details