తెలంగాణ

telangana

By

Published : Nov 9, 2019, 5:49 PM IST

ETV Bharat / state

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి'

సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదంపై వెలువరించిన తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. అందరూ శాంతి, సహనంతో ఉండాలని కోరారు.

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి'

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సీపీఐ నేత నారాయణ స్వాగతించారు. ఈ వివాదం ఎప్పటినుంచో రావణకాష్టంలా రగులుతూనే ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా తీర్పు ఇచ్చినందకు సంతోషంగా ఉందని వెల్లడించారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆమోదించి శాంతి, సహనంతో ఉండాలని సూచించారు.

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details