తెలంగాణ

telangana

శంషాబాద్‌లో మరో దారుణం.. కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం

By

Published : Nov 30, 2019, 5:08 AM IST

Updated : Nov 30, 2019, 7:27 AM IST

శంషాబాద్​ టోల్​ప్లాజ్​ వద్ద ఘోరం జరిగి 24 గంటలైనా గడవలేదు... పోలీసులూ తిరుగుతూనే ఉన్నారు. ప్రజలంతా ఆ దారుణం నుంచి తేరుకోనేలేదు. అంతలోనే మరో ఘటన చోటుచేసుకుంది. నిన్నటి ఘటనా ప్రాంతానికి కిలోమీటరు దూరంలోనే... ఓ దేవాలయ సమీపంలో సగం కాలిన మహిళ శవం లభ్యం కావటం కలకలం రేపుతోంది.

ANOTHER INCIDENT HAPPEN AT SHAMSHABAD TOLL PLAZA
ANOTHER INCIDENT HAPPEN AT SHAMSHABAD TOLL PLAZA

శంషాబాద్‌లో మరో దారుణం.. కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం
హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై హత్యాచార ఘటన మరువక ముందే అలాంటి ఘాతుకం వెలుగుచూసింది. సిద్దులగుట్ట రోడ్డులో బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు మృతదేహంపై కిరోసిన్‌ పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళను ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి తగులబెట్టారా? లేక ఇక్కడే హత్యాచారం చేసి మృతదేహాన్ని తగులబెట్టారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహం కాలిపోయి గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉండటంతో కొన్ని ఆధారాలను మాత్రమే పోలీసులు సేకరించగలిగారు.

శంషాబాద్‌లో మరో దారుణం.. కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం

ఆ ప్రదేశం నిర్మానుష్య ప్రాంతం కావడంతో పూర్తి సమాచారం సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. మృతదేహం దగ్ధమవుతున్న సమయంలో అటుగా వెళ్తున్న వారు చూసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పోలీసులకు సమాచారమందించడంతో ఈఘటన వెలుగు చూసింది. యువతి హత్యకేసును 48 గంట్లలోపే ఛేదించామని పోలీసులు భావిస్తున్న తరుణంలో సిద్దులగుట్ట రోడ్డులో జరిగిన ఈ ఘటన మరో సవాల్‌గా మారింది.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Last Updated : Nov 30, 2019, 7:27 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details