తెలంగాణ

telangana

ETV Bharat / state

కోదండరాం దీక్ష విరమింపజేసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

By

Published : Jul 2, 2020, 4:18 PM IST

Updated : Jul 2, 2020, 7:11 PM IST

కోదండరాం దీక్ష విరమింపజేసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
కోదండరాం దీక్ష విరమింపజేసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

16:16 July 02

కోదండరాం దీక్ష విరమింపజేసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

కరోనా నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నాంపల్లిలోని తెజస రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కోదండరాం దీక్ష చేపట్టారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన దీక్ష.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. నిరసన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నిమ్మరసం ఇచ్చి కొదండరాం చేత దీక్ష విరమింపజేశారు. కరోనా వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కారించాలని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్, పీఓడబ్ల్యూ సంధ్య హాజరై దీక్షకు సంఘీభావం ప్రకటించారు.  

'కరోనా పైసల లెక్క చెప్పాల్సిందే'

కొవిడ్ వైరస్ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎన్ని నిధులు వచ్చాయో బహిర్గతం చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. కరోనాను సంపూర్ణంగా అరికట్టేందుకు రాష్ట్రంలోని వనరులను పూర్తిగా ఖర్చు చేయాలన్నారు.

                                                                            - "కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు"

వెంటనే అఖిలపక్ష భేటీకి పిలవాలి

   కొవిడ్ ఎవరికి వచ్చినా.. గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తామన్న కేసీఆర్.. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలకు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.  కేసీఆర్ ద్వంద వైఖరి బయట పడింది. ప్రతిపక్ష పార్టీలు లేవని అవహేళన చేస్తున్న కేసీఆర్.. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.

                                                                            - "ఎల్ రమణ, తెతెదేపా అధ్యక్షుడు"

ఆరోగ్యశ్రీలో చేర్చాలి..

 కొవిడ్ మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు భరోసా కల్పించాలని కోరారు, లేని పక్షంలో కోహెడ పండ్ల మార్కెట్ షెడ్స్ మాదిరిగానే తెరాస ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు.  దేశ ప్రధానే కోవిడ్ ఉద్ధృతి నవంబర్ వరకు కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ వరకు ఐదు కిలోల బియ్యం, కిలో పప్పు ఉచితంగా ఇస్తామని చెప్పారని.. పేదలకు ఆర్థిక ప్యాకేజీ సైతం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

                                                 హైదరాబాద్ జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి కొవిడ్ ఆసుపత్రిని ఎందుకు ఉపయోగించట్లేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయనడం సరికాదన్నారు. బతికుంటే బలిసాకు తినైనా బతుకొచ్చన్న కేసీఆర్.. రాష్ట్ర ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడి  పిట్టలు రాలినట్లు రాలినా పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు.  

                                                                                  - "సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, చాడ వెంకట్ రెడ్డి"  

మాట వినకుంటే ఉద్యమం తప్పదు

ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. రాష్ట్ర సంక్షేమ దృష్ట్యా తమ మాట వినకుంటే బస్తీల్లోకి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు.

 ఇవీ చూడండి :కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్

Last Updated : Jul 2, 2020, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details