తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో మేమే ప్రత్యమ్నాయం: మురళీధర్ రావు

దక్షిణ భారతదేశంలో భాజపా కాస్త వెనకబడిందని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. కర్ణాటకలో మా ప్రభుత్వం లేనప్పటికీ మెజారిటీ స్థానాలు గెలిచి సత్తా చాటామన్నారు.

By

Published : May 26, 2019, 5:05 PM IST

తెలంగాణలో మేమే ప్రత్యమ్నాయం

లోక్​సభ ఎన్నికల ఫలితాలపై భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. దక్షిణ భారతదేశంలో పార్టీ కాస్త వెనకబడిందని, కర్ణాటకలో మాత్రం 26 స్థానాలకు గానూ... 25 గెలిచి సత్తా చాటామన్నారు. తెంలగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించి, భాజపా, కాంగ్రెస్ పని అయిపోయిందని ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. ఎంఐఎంతో కలిసి 17 సీట్లు సాధిస్తామన్నారు... కానీ ప్రజలు భాజపాను ఆదరించారని చెప్పారు. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో మేమే ప్రత్యమ్నాయం

ABOUT THE AUTHOR

...view details