తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధు పేరు మార్చి పెట్టారు:కేటీఆర్

రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధును ఎన్డీయే సర్కారు రూపొందించడంపై కేటీఆర్ హర్షం

By

Published : Feb 1, 2019, 4:33 PM IST

ASADUDDIN

తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధునే ఎన్టీయే ప్రభుత్వం పేరు మార్చి బడ్జెట్​లో పెట్టిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ట్విట్టర్​లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధుతో.. దేశ ప్రజలకు మేలు జరగడం ఆనందంగా ఉందన్నారు. ప్రశంసకు అనుకరణ ఉత్తమ మార్గమని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ట్వీట్​పై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధానికి కాపీ పేస్ట్ చేయడం తప్ప దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సొంత ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో కేసీఆర్ దూరదృష్టి, చురుకుదనం కనిపిస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details