తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రిల్ మెషిన్​లో ఒకరు.. వెండి పూతతో మరొకరు

అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లలో మార్పు రావడం లేదు. ఏదో రూపంలో బంగారం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇలాగే తీసుకొస్తూ శంషాబాద్​ విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారులకు ఇద్దరు ప్రయాణికులు పట్టుబడి పోయారు. వారి వద్ద 800 గ్రాముల పుత్తడి దొరికింది.

By

Published : Mar 23, 2019, 10:17 AM IST

Updated : Mar 23, 2019, 12:54 PM IST

800 గ్రాముల బంగారం పట్టివేత

800 గ్రాముల బంగారం పట్టివేత
విశ్వసనీయ సమాచారంపై హైదరాబాద్ శంషాబాద్​ విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్​ రవి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్​ చేశారు. రియాజ్​ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి డ్రిల్లింగ్​ మిషన్​లో కడ్డీరూపంలో అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్​ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి దగ్గర 200 గ్రాములున్న సిల్వర్​ పూత పూసిన బంగారు ప్లేట్​ను పట్టుకున్నారు. ​వీటి విలువ రూ.27 లక్షలుగా తెలిపారు.
Last Updated : Mar 23, 2019, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details