తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యల పరిష్కారానికై గిరిజన ఉపాధ్యాయుల ధర్నా

పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ... గిరిజన ఉపాధ్యాయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు.

By

Published : Sep 26, 2019, 7:28 PM IST

ఉపాధ్యాయుల ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగే సర్ ప్లస్ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్​ను ఆపివేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్​లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. పాఠశాలల్లో తక్కువ విద్యార్థులు ఉన్నచోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నవారిని వేరే చోటకు బదిలీ చేయాలని ఐటీడీఏ పీవోవీపీ గౌతమ్ సూచించారు. విద్యా సంవత్సరం మధ్యలో కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు వాపోయారు. ఎస్జీటీ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్​ను వాయిదా వేయాలని కోరారు.

ఉపాధ్యాయుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details