తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2020, 6:28 AM IST

ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​పై సస్పెన్షన్

100 మీటర్ల పరుగు ప్రపంచ ఛాంపియన్​ క్రిస్టియన్ కోల్​మన్​పై నిషేధం విధించింది అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్. నిర్ణీత వ్యవధిలో డోప్ పరీక్షలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణం.

World's fastest man suspended for missing doping tests
కోల్​మన్

100 మీటర్ల పరుగు ప్రపంచ ఛాంపియన్‌ క్రిస్టియన్‌ కోల్‌మన్‌పై అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) సస్పెన్షన్‌ వేటు వేసింది. నిర్ణీత వ్యవధిలో డోప్‌ పరీక్షలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణం.

గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ముంగిట కోల్​మన్​ రెండుసార్లు డోప్‌ పరీక్షలకు అందుబాటులో లేకపోవడంపై దుమారం రేగింది. డిసెంబరు 9న, మూడోసారి అతను డోప్‌ పరీక్షకు హాజరు కాలేదు. దీనిపై విచారించిన ఏఐయూ ఇప్పుడు సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే డిసెంబరు 9న తాను క్రిస్మస్‌ షాపింగ్‌లో ఉండగా ఉద్దేశపూర్వకంగా పరీక్షకు పిలిచి తాను దానికి దూరమయ్యేలా చేశారని కోల్‌మన్‌ ఆరోపించాడు.

ABOUT THE AUTHOR

...view details