తెలంగాణ

telangana

ETV Bharat / sports

తెరుచుకోనున్న క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు

కరోనా లాక్​డౌన్ నాలుగో విడత మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. క్రీడా ప్రాంగణాలకు, స్టేడియాలకు సడలింపులు ఇచ్చింది. కానీ ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది.

By

Published : May 17, 2020, 7:29 PM IST

స్టేడియం
స్టేడియం

కరోనా నాలుగో విడత లాక్​డౌన్​కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈసారి సడలింపులు ఇచ్చిన వాటిలో క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు కూడా ఉన్నాయి.

"క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు తెరవచ్చు. కానీ ప్రేక్షకులకు అనుమతి ఉండదు."- ఎన్​డీఎమ్​ఏ

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే దేశంలో లాక్​డౌన్ కొనసాగుతోంది. మూడో విడతలో కొన్నింటికి సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా నాలుగో విడతలో మరికొన్నింటికి సడలింపులు ఇచ్చింది. లాక్​డౌన్ మే 31 వరకు కొనసాగుతుందని స్పష్ట చేసింది.

ABOUT THE AUTHOR

...view details