తెలంగాణ

telangana

ETV Bharat / sports

Paralympics: 'అప్పుడు 19 మంది.. ఇప్పుడు 19 పతకాలు'

పారాలింపిక్స్​ విజేతలను సన్మానించిన క్రీడామంత్రి అనురాగ్ ఠాకుర్(anurag thakur).. వారి విజయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది.

By

Published : Sep 8, 2021, 6:25 PM IST

paralympics anurag thakur
పారాలింపిక్స్

టోక్యో పారాలింపిక్స్​లో(paralympics 2021) మన అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 పతకాలు గెలుచుకున్నారు. దీంతో మన క్రీడాకారులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిల్లీలో వారికి జరిగిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర క్రీడామంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"వాళ్ల విజయం చరిత్రలో నిలిచిపోయింది. గతసారి 19మంది అథ్లెట్లు పోటీలకు వెళ్తే.. ఈసారి 19 పతకాలు తీసుకొచ్చారు. ఈ విషయమై మనందరం వారికి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి" అని అన్నారు.

దీంతో ఆ ఈవెంట్​లో ఉన్నవాళ్లందరూ నిలబడి, చప్పట్లతో పారాలింపిక్స్(paralympics india) విజేతలను అభినందించారు.

సుమిత్(జావెలిన్ త్రో), కృష్ణ నాగర్(బ్యాడ్మింటన్), ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్, అవని లేఖరా(షూటింగ్) స్వర్ణాలు గెలుచుకుని దేశానికే గర్వకారణంగా నిలిచారు.

దిల్లీలో పారాలింపిక్స్ ప్లేయర్ల సన్మాన కార్యక్రమం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details