తెలంగాణ

telangana

మైదానంలో అభిమాని.. రెండో టెస్టుకు అంతరాయం

By

Published : Aug 15, 2021, 5:31 AM IST

లార్డ్స్​లో రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అంతా ఆసక్తిగా మ్యాచ్​ తిలకిస్తున్నారు. టీమ్​ఇండియా ఆటగాళ్లు ఫీల్డింగ్​లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఓ హాస్యభరిత సంఘటన జరిగింది. అది ఏంటంటే..?

India jersey
టీమిండియా

లార్డ్స్​లో జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి టీమ్ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్​లోకి వచ్చి హల్​చల్ చేశాడు. అతని జెర్సీ వెనుక జార్వో అని రాసి ఉంది. ఆ వ్యక్తి గ్రౌండ్​లోకి రావటం వల్ల ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది.

భద్రతా సిబ్బంది.. అతడిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నించారు. అయితే ఆ వ్యక్తి మాత్రం.. తాను కూడా ఆడేందుకు సిద్ధమని తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఇదీ చదవండి:రాహుల్​పై బీరు కార్క్స్​.. ఇంగ్లాండ్​ ఫ్యాన్స్​ అత్యుత్సాహం

ABOUT THE AUTHOR

...view details