తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2019, 2:05 PM IST

ETV Bharat / sports

జాతీయ క్రీడా పురస్కారాల కోసం కమిటీ సిద్ధం

జాతీయ క్రీడా పురస్కారాల విజేతలను ఎంపిక చేసేందుకు సిద్ధమైంది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. అందుకోసం 12 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈనెల 29న భారత హాకీ దిగ్గజం మేజర్​ ధ్యాన్​చంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది.

జాతీయ క్రీడా పురస్కారాలు కోసం కమిటీ సిద్ధం

జాతీయ క్రీడా పురస్కారాల విజేతలను నిర్ణయించేందుకు 12 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ. ఈ బృందమే ఆటగాళ్లు, కోచ్​లను అవార్డుల కోసం ఎంపిక చేయనుంది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ మేరీకోమ్, భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ బైచుంగ్ భూటియాలకు ఈ సెలక్షన్​ ప్యానెల్​లో చోటు దక్కింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ముకుందం శర్మ అధ్యక్షత వహిస్తున్నారు.

మేరీకోమ్​, బైచుంగ్ భుటియా

ఈ బృందంలో క్రీడాశాఖ సెక్రటరీ రాథే శ్యామ్ జులానియాతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) సీఈఓ కమాండర్ రాజేశ్ రాజగోపాలన్, మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా, మాజీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, టేబుల్ టెన్నిస్ కోచ్ కమలేశ్ మెహతా ఉన్నారు. వీరితో పాటు టైమ్స్ గ్రూప్ డిజిటల్ విభాగం చీఫ్ ఎడిటర్ రాజేశ్ కల్రా, ప్రఖ్యాత క్రీడా వ్యాఖ్యాత చారు శర్మలకు కేంద్ర క్రీడాశాఖ చోటు కల్పించింది.

ఇవీ ప్రధాన విభాగాలు...

క్రీడా రంగంలో సేవలందించిన, ప్రతిభ చూపించిన వారికి ప్రతి ఏటా 8 విభాగాల్లో ఈ అవార్డులు ఇస్తుంది భారత ప్రభుత్వం. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ఏకలవ్య, పద్మభూషణ్​, పద్మశ్రీ, పద్మ విభూషణ్​, ద్రోణాచార్య అవార్డు (కోచ్‌ల కోసం), ధ్యాన్ చంద్ అవార్డు (జీవితకాల సాధన) పేరుతో పురస్కారాలు అందజేస్తోంది.

ప్రతి ఏటా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్​చంద్ పుట్టినరోజైన ఆగస్టు 29న ఈ జాతీయ క్రీడా పురస్కారాల వేడుక జరుపుతున్నారు. ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగానూ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ఇవీచూడండి...వివాహబంధంతో ఒక్కటి కానున్న మల్లయోధులు

ABOUT THE AUTHOR

...view details