తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2019, 10:27 AM IST

ETV Bharat / sports

ఓసీఏ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా సర్దార్ ​సింగ్

భారత జట్టు మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్​కు అరుదైన గౌరవం లభించింది. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్​ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆయన నామినేట్ అయ్యారు. నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు.

సర్దార్ సింగ్

భారత మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్..​ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్(ఓసీఏ) స్టాండింగ్​ కమిటీ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. మార్చి2, 3 తేదీల్లో బ్యాంకాంక్​లో జరిగిన ఓసీఏ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుంది ఒలింపిక్ కౌన్సిల్. 10 మంది సభ్యులుండే ఈ ప్యానల్​లో సర్దార్ నాలుగేళ్ల పాటు(2019-2023) కొనసాగనున్నారు.

"ఓసీఏ నిబంధనలను అనుసరించి స్టాండింగ్ కమిటీ సభ్యులను నామినేట్ చేశా. వారందరికి నా అభినందనలు. రాబోయే నాలుగేళ్లలో మీ సహకారంతో మరింత ముందుకెళ్తాం" -- షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబాహ్, ఓసీఏ అధ్యక్షుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details