తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2023 : ముంబయి ఆల్​రౌండ్​ షో.. దిల్లీపై ఘన విజయం..

WPL 2023 : మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా దిల్లీ, ముంబయి​ మధ్య జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. దిల్లీ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలిచింది.

By

Published : Mar 9, 2023, 10:15 PM IST

Updated : Mar 9, 2023, 10:56 PM IST

mumbai indians won against delhi capitals
mumbai indians won against delhi capitals

WPL 2023 : మహిళల ప్రీమియర్​ లీగ్ 2023​లో ముంబయి ఇండియన్స్​ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇఇప్పటికే గుజరాత్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లపై గెలుపొందిన హర్మన్‌ సేన.. ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్‌ పై జయ కేతనం ఎగురవేసి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. దిల్లీపై జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దిల్లీ​ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి ఓపెనర్లు​ యాస్తికా భాటియా(41; 32 బంతుల్లో 8 ఫోర్లు), హీలీ మాత్యూస్ (32; 31 బంతుల్లో 6 ఫోర్లు) పరుగులతో రాణించారు. నాట్ సివర్​ బ్రంట్(23*), కెప్టెన్​ హర్మన్​ ప్రీత్​ కౌర్(11*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లు అలిస్ క్యాప్సీ, తారా నోరిస్​ చెరో వికెట్​ తీశారు.

టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్​ చేసిన దిల్లీ.. 18 ఓవర్లలో 105 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లానింగ్​(43; 41 బంతుల్లో 5 ఫోర్టు) కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడి రాణించింది. జెమీమా రోడ్రిగ్స్​(25; 18 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. షెఫాలీ వర్మ(2), అలీస్​ క్యాప్సీ(6), మరిజన్నే కాప్​(2), జొనాసెన్(2), తనియా భాటియా(4), మిన్ను మని(0), రాధా యాదవ్(10), శిఖా పాండే(4), తారా నోరిస్(0) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. ముంబయి బౌలర్లు సైకా ఇషాక్(3), వాంగ్(3) హీలీ మాత్యూస్​(3) వికెట్ల తీసి చెలరేగిపోయారు. పూజా వస్త్రాకర్ ఒక వికెట్​ పడగొట్టింది. కాగా, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన దిల్లీ క్యాపిటల్స్​ జట్టుకి ఇది తొలి ఓటమి.

కొంప ముంచిన ఓవర్లు!
అయితే, 12 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 80 పరుగులతో కొంచెం మెరుగ్గ మెరుగ్గానే కనిపించిన దిల్లీ.. మరో 25 పరుగులే చివరి ఏడు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక, 13వ ఓవర్‌లో ఇషాక్‌.. రోడ్రిగ్స్‌, మెగ్‌ లానింగ్‌లను పెవీలియన్​ పంపించి దిల్లీని గట్టి దెబ్బకొట్టింది. ఆ తర్వాతి ఓవర్‌లో కూడా దిల్లీ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌లో రాణించిన జొనాసెన్‌తో పాటు మిన్నును.. మాథ్యూస్‌ ఓట్​ చేసింది. ఇక, 16.2, 16.6 బంతుల్లో ఇస్సీ వాంగ్‌.. భాటియా, రాధాయాదవ్‌లను ఔట్‌ చేసింది. తర్వాతి ఓవర్లో నోరిస్‌ను.. ఎల్​బీడబ్ల్యూ కావడం వల్ల దిల్లీ ఆలౌటైంది.

కాగా, వరుసగా మూడు సార్లు జయకేతనం ఎగుర వేసిన ముంబయి ఇండియన్స్​ జట్టు.. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో​ మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండు మ్యాచ్​లు గెలిచి మూడో మ్యాచ్​లో ఓడిపోయిన్ దిల్లీ క్యాపిట్స్ 4 పాయింట్లతో​ రెండో స్థానంలో ఉంది. ఇక, రెండు మ్యాచ్​లు ఆడి.. ఒక దాంట్లో గెలిచిన యూపీవారియర్స్​, మూడు మ్యాచ్​లో ఒకటి గెలిచిన గుజరాత్ జెయింట్స్​​.. చెరో 2 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాలకు పరిమితమయ్యాయి. ఇక ఇంకా ఖాతా తెరవని రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. 0 పాయింట్లతో టేబుల్​ చివరి స్థానంలో ఉంది.

Last Updated : Mar 9, 2023, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details