తెలంగాణ

telangana

By

Published : Jun 16, 2022, 10:06 AM IST

ETV Bharat / sports

బీసీసీఐ నయా ప్లాన్​.. ఇకపై 'వన్​ నేషన్​ టూ టీమ్స్​'గా!

Teamindia two teams: భవిష్యత్​లో టీమ్​ఇండియా.. పూర్తిస్థాయిలో రెండు జట్లుగా విడిపోయి ఏకకాలంలో రెండు సిరీస్​ల్లో ఆడే విధానాన్ని తీసుకురావడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిపాడు బీసీసీఐ కార్యదర్శి జైషా. త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తామని అన్నాడు.

teamindia
టీమ్​ఇండియా

Teamindia two teams: టీమ్​ఇండియా గురించి బీసీసీఐ కార్యదర్శి జైషా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్​లో 'వన్​ నేషన్.. టూ టీమ్స్​' విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు. అంటే..​ రాబోయే రోజుల్లో ఒకే సమయంలో రెండు భారత జట్లు వేర్వేరు దేశాల్లో సిరీస్​లు ఆడే అవకాశం ఉందని చెప్పాడు. భారత జట్టు ఇటీవలే కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్​తో టెస్టులు ఆడగా.. అదే సమయంలో లంకతో వన్డే, టీ20లను ధావన్​ నేతృత్వంలో మరో భారత జట్టు ఆడింది. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్​తో ఆడేందుకు సీనియర్​ జట్టు సిద్ధమవుతుండగా.. మరో టీమ్ పాండ్య సారథ్యంలో ఐర్లాండ్​తో సిరీస్​ ఆడనుంది. ఆ నేపథ్యంలోనే జైషా ఈ వ్యాఖ్యలు చేశాడు.

"నేను ఎన్​సీఏ హెడ్​ వీవీఎస్​ లక్ష్మణ్​తో చర్చలు జరిపాను. రోస్టర్​ విధానంలో కనీసం 50 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. భవిష్యత్​లో టీమ్​ఇండియా రెండు జట్లుగా విడిపోయి.. ఓ దేశంలో టెస్టు సిరీస్​.. మరో దేశంలో వన్డే సిరీస్​ ఆడేలా సన్నాహాలు చేస్తున్నారు.. ఏకకాలంలో రెండు జట్లు రెండు సిరీస్​లను ఆడే విధంగా మేం ముందుకుసాగుతున్నాం." అని షా అన్నాడు.

ఇదీ చూడండి: అది నా వల్ల సాధారణ విషయంగా మారింది: మిథాలీ

ABOUT THE AUTHOR

...view details