తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఈ ఏడాది కోహ్లీతో జరిగిన పోరు మరిచిపోలేను'

ఈ ఏడాది టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీని(Kohli vs Anderson) తాను ఎదుర్కొన్న తీరు ఎప్పటికీ మరిచిపోలేనని అన్నాడు ఇంగ్లాండ్ ఫాస్ట్​ బౌలర్ జేమ్స్ అండర్సన్. రానున్న యాషెస్ సిరీస్​​లో(Ashes 2021) ఆస్ట్రేలియా స్టార్​ బ్యాట్స్​మన్ స్టీవ్​ స్మిత్​ తన(James Anderson News) నెక్స్ట్​ టార్గెట్ అని చెప్పాడు.

By

Published : Oct 15, 2021, 10:04 AM IST

anderson, kohli
ఆండర్సన్, కోహ్లీ

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీని పలుమార్లు ఔట్​ చేశాడు ఫాస్ట్​ బౌలర్ అండర్సన్(Kohli vs James Anderson). ఈ విషయం(James Anderson News) బాగా చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై మాట్లాడిన అండర్సన్.. ఈ ఏడాది విరాట్​తో పోటీపడ్డ తీరు ఎప్పటికీ తన ఫేవరెట్​ అని పేర్కొన్నాడు. ఎన్నటికీ మరిచిపోలేనిదని చెప్పాడు.

"గత కొన్నేళ్లుగా విరాట్​కు నాకు గట్టి పోటీ కొనసాగుతోంది. ఈ ఏడాది పోరు మాత్రం ఎప్పటికీ నా ఫేవరెట్​గా నిలిచిపోతుంది​. ఇంగ్లాండ్, భారత్.. వేదిక ఏదైనా కోహ్లీతో పోటీ పడటం ఆసక్తికరంగా ఉంటుంది. అతడిని చాలా సార్లు పెవిలియన్​కు పంపాను. నా ఓవర్​లో అతడు పరుగులు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పరస్పరం గౌరవంతో కూడుకున్న పోటీ. ఇది నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది."

-- అండర్సన్, ఇంగ్లాండ్ ఫాస్ట్​ బౌలర్.

డిసెంబరులో జరగనున్న యాషెస్​ సిరీస్​పై(Ashes 2021) మాట్లాడిన అండర్సన్.. ఆస్ట్రేలియా స్టార్​ బ్యాట్స్​మన్ స్టీవ్​ స్మిత్​కు బౌలింగ్​ చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. ఓ బౌలర్​గా తాను ఉత్తమ బ్యాట్స్​మన్​ను ఔట్​ చేయాలనే ఎదురుచూస్తానని తెలిపాడు. యాషెస్​లో తాను అన్నీ మ్యాచ్​లు ఆడాల్సిన అవసరం లేదని, మూడు లేదా నాలుగు టెస్టులు ఆడితే సరిపోతుందని అన్నాడు.

ఇదీ చదవండి:

కోహ్లీ ఎదుర్కొన్న ఉత్తమ బౌలర్లలో అండర్సన్​​కు చోటు

'అతడి బౌలింగ్​లో కోహ్లీ తడబడుతున్నాడు!'

ABOUT THE AUTHOR

...view details