తెలంగాణ

telangana

By

Published : Jul 27, 2021, 4:08 PM IST

Updated : Jul 27, 2021, 4:45 PM IST

ETV Bharat / sports

కృనాల్‌ పాండ్యాకు కరోనా.. రెండో టీ20 వాయిదా

Krunal Pandya tests positive for COVID-19, second T20I postponed
కృనాల్‌ పాండ్యాకు కరోనా .. రెండో టీ20 వాయిదా

16:06 July 27

కరోనా కలకలం

టీమ్ఇండియా, శ్రీలంక మధ్య మంగళవారం జరగనున్న రెండో టీ20 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్​ అభిమానులకు ఊహించని షాక్​ ఎదురైంది! భారత ఆల్​రౌండర్​ కృనాల్​ పాండ్యాకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో అతడితో సన్నిహతంగా ఉన్న 8 మంది క్రికెటర్లనూ ఐసోలేషన్​కు తరలించారు. దీంతో నేడు(జులై 27)న జరగాల్సిన మ్యాచ్​ను బుధవారానికి(జులై 28) వాయిదా వేసినట్లు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలోని మిగిలిన క్రికెటర్లకూ కొవిడ్​ పరీక్షలు నిర్వహించనున్నారు.  

అయితే లంకతో పరిమిత ఓవర్ల సిరీస్​ను ఈనెల 13 నుంచి ప్రారంభించాల్సి ఉంది. కానీ, లంక బ్యాటింగ్​ కోచ్​, సహాయక సిబ్బందికి కరోనా సోకడం వల్ల జులై 18 నుంచి వన్డే సిరీస్​ ప్రారంభించారు.  

పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం లంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు వన్డే సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తొలి టీ20లో 38 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. అయితే ఇదే ఉత్సాహంలో రెండో మ్యాచ్​లోనూ నెగ్గి సిరీస్​ను దక్కించుకోవాలని గబ్బర్​ సేన ప్రణాళికలు రచించింది.  

Last Updated : Jul 27, 2021, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details