రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, లఖ్నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్ నవీనుల్ హక్ మధ్య ఇటీవలే జరిగిన వివాదం చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య గొడవ జరిగి వారం రోజులు గడుస్తున్నా.. వివాదానికి మాత్రం తెర పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య వార్ నడుస్తుందా అంటే.. ఔను అనే చెప్పాలి. తాజాగా నవీనుల్ హక్ ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ మరిన్ని చర్చలకు తావిస్తోంది.
గౌతమ్ గంభీర్తో ఉన్న ఫొటోకు.. 'మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని అనుకుంటారో మీరూ అలానే ఉండాలి. మీతో ప్రజలు ఎలా మాట్లాడాలని అనుకుంటారో మీరూ అలానే మాట్లాడాలి' అంటూ కామెంట్ జత చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు నవీనుల్. అతడు చేసిన ఈ పోస్ట్కు లఖ్నవూ మెంటార్ గంభీర్ కూడా స్పందించాడు. 'నువ్వు నీలానే ఉండు.. ఎప్పటికీ మారొద్దు' అని కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చాడు. గంభీర్ కామెంట్తో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే శనివారం బెంగళూరు, దిల్లీతో మ్యాచ్ ఓడిన అనంతరం నవీనుల్ ఈ పోస్ట్ చేయటం వివాదాస్పదమైంది.