తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2021, 9:26 PM IST

ETV Bharat / sports

సీఎస్కే సమష్టి కృషి.. రాజస్థాన్ లక్ష్యం 189

రాజస్థాన్ రాయల్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. డుప్లెసిస్ (33), రాయుడు (27) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

jadeja
జడేజా

రాజస్థాన్​ రాయల్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్​లో మెరిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఫలితంగా రాజస్థాన్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన చెన్నై సూపర్​ కింగ్స్​ ఇన్నింగ్స్​ను డుప్లెసిస్ ధాటిగా ఆరంభించాడు. 17 బంతుల్లోనే 33 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ (10) మరోసారి నిరాశపర్చాడు. మొయిన్ అలీ (26), రైనా (18), రాయుడు (27) మెరుపులు మెరిపించినా తొందరగానే ఔటయ్యారు. జడేజా (8), ధోనీ (18), సామ్ కరన్ (13) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివర్లో బ్రావో (20) దంచికొట్టడం వల్ల సీఎస్కే 188 పరుగులు చేయగలిగింది.

ABOUT THE AUTHOR

...view details