తెలంగాణ

telangana

By

Published : May 15, 2023, 12:10 PM IST

Updated : May 15, 2023, 7:17 PM IST

ETV Bharat / sports

ICC Soft Signal : క్రికెట్​లో​ ఆ రూల్స్​లో​ మార్పు​.. అప్పటి నుంచి అమలులోకి!

ICC Soft Signal : మైదానంలో జరిగే క్యాచ్ ఔట్ వివాదాలకు ఇకపై ఐసీసీ చెక్ పెట్టనుంది. జూన్​లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్ మ్యాచ్​ నుంచి ఆ నిబంధనను తొలగించనుందట. ఇంతకీ ఈ రూల్​ ఏంటంటే?

no soft signal
no soft signal

ICC Soft Signal : వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ 2023 ఫైనల్​ నేపథ్యంలో ఆంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మైదానంలో ఎన్నో వివాదాలకు కారణమైన 'సాఫ్ట్​ సిగ్నల్​' నిబంధనను తొలగించింది. అయితే ఇదివరకు క్రికెట్​లో క్యాచ్ ఔట్​ల విషయంలో చాలా సార్లు ఈ సాఫ్ట్​ సిగ్నల్ అంశం వివాదంగా మారింది. ఈ సాఫ్ట్​ సిగ్నల్ నిబంధన కారణంగా ఎన్నో మ్యాచ్​ల ఫలితాలు మారాయి. ఈ విషయమై పలు దేశాల క్రికెట్​ బోర్డులు ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. పలు దఫాల చర్చల అనంతరం ఈ వివాదాలకు ఇప్పుడు తెర పడింది. సాఫ్ట్​ సిగ్నల్ నిబంధనను తొలగించే ప్రతిపాదనకు సౌరభ్​ గంగూలీ సారథ్యంలోని ఐసీసీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మ్యాచ్​ జరుగుతున్నప్పుడు, గ్రౌండ్​లో సహజంగా వెలుతురు తక్కువ అయినప్పుడు ఫ్లడ్ లైట్లను ఉపయోగించి ఆటను కొనసాగించేలా కూడా ఐసీసీ మార్పులు తెచ్చింది.

ఇంతకీ ఎంటా సాఫ్ట్ సిగ్నల్ నిబంధన..మ్యాచ్​లో బ్యాటర్ ఔట్​ అయిన విధానం పట్ల ఫీల్డ్ అంపైర్​కు సందేహం ఉంటే థర్డ్​ అంపైర్​కు రిఫర్​ చేస్తాడు. అయితే ఇది మామూలే. కానీ ఫీల్డ్ ఫీల్డ్​ అంపైర్ అలా థర్డ్​ అంపైర్​కు రిఫర్​ చేసేటప్పుడు.. అది ఔట్​? నాటౌట్​? అని ఎదైనా ఒకటి తన నిర్ణయంగా సాఫ్ట్ సిగ్నల్ రూపంలో చెప్పాలి. అలా ఫీల్డ్ అంపైర్ తన అభిప్రాయాన్ని థర్డ్​ అంపైర్​కు వెల్లడించటమే 'సాఫ్ట్ సిగ్నల్' నిబంధన. అయితే రివ్యూలో థర్డ్​ అంపైర్​కు స్పష్టత రానప్పుడు.. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌ను పరిగణలోకి తీసుకొనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు థర్డ్​ అంపైర్​. ఇలా చాలా సార్లు ఫీల్డ్​ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కు కట్టుబడి థర్డ్ అంపైర్ ప్రకటించిన తీర్పు పట్ల అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి.

హెల్మెట్​ కంపల్సరీ..దీంతో పాటు ఎక్కువ రిస్క్​ ఉన్న స్థానాల్లో హెల్మెట్​ ధరించాలనే నిబంధనను కంపల్సరీ చేసింది ఐసీసీ. బ్యాటర్లు ఫాస్ట్​ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు, వికెట్​ కీపర్స్ స్టంప్స్​ వెనుక ఉన్నప్పుడు, ఫీల్డర్లు బ్యాటర్​కు దగ్గర​గా ఉన్నప్పుడు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని తెల్చిచెప్పింది. దీంతో పాటు ఫ్రీ హిట్​ నిబంధనకు కొన్ని మార్పులు చేసింది. బంతి స్టంప్స్​కు తాకినా.. ఫ్రీ హిట్​లో స్కోర్ చేసిన పరుగులను పరిగణలోకి తీసుకుంటారు. ఈ మార్పులు 1 జూన్​ 2023న ఇంగ్లాండ్​, ఐర్లాండ్ మధ్య జరగబోయే టెస్టు మ్యాచ్​లో అమలులోకి రానున్నాయి.

మ్యాచ్​ డ్రాకు నో ఛాన్స్​ .. జూన్ 7-11 మ్యాచ్​ జరగనుండగా.. జూన్ 12వ తేదీని ఇదివరకే రిజర్వ్ డే గా ప్రకటించారు. ఈ రిజర్వ్ డేకు తోడు​ సాఫ్ట్ సిగ్నల్ తొలగింపు, ఫ్లడ్​ లైట్లు ఉపయోగించటం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్​ డ్రా గా ముగిసే అవకాశమే లేదంటున్నారు క్రీడా విశ్లేషకులు. భారత్, ఆస్ట్రేలియాల్లో ఏదో ఒక జట్టు కచ్చితంగా గెలుస్తుందని పలువురు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఒకవేళ ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే భారత్ - ఆస్ట్రేలియా జూన్​ మధ్య పోరు మరింత ఉత్కంఠగా మారనుంది.
కాగా ఈ నెల ఆఖరి వారంలో కోచ్ రాహుల్​ ద్రవిడ్​ సహా టీమిండియా కీలక ఆటగాళ్లు ఇంగ్లాండ్​కు పయనం కానున్నారు. ఛెతేశ్వర్​ పుజారా ఇప్పటికే లండన్​లో కౌంటీ ఛాంపియన్​షిప్​ టోర్నీ ఆడుతున్నాడు. టోర్నీలో ససెక్స్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న పుజారా ఇంగ్లాండ్​ పిచ్​లపై అద్భుతంగా రాణిస్తున్నాడు.

Last Updated : May 15, 2023, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details