తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: అండర్-19లో నెగ్గాడు..మరి ప్రపంచకప్​లో..!

దాదాపు 11 ఏళ్ల తర్వాత ప్రపంచకప్​ సెమీస్​లో తలపడతున్నాయి భారత్- న్యూజిలాండ్​. అప్పుడు అండర్-19 కెప్టెన్​లుగా ఉన్న కోహ్లీ(భారత్), విలియమ్సన్(న్యూజిలాండ్)... ఇప్పుడు జాతీయ జట్టుకు సారథ్యం వహిస్తూ మెగాటోర్నీలో తలపడుతున్నారు.

By

Published : Jul 7, 2019, 8:14 PM IST

WC19: అండర్-19లో నెగ్గాడు..మరి ఈ ప్రపంచకప్​లో..!

ప్రపంచకప్​లో సెమీస్​ పోరుకు సిద్ధమైంది. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. 2008 లో అండర్-19 ప్రపంచకప్ సెమీస్​​లో తలపడ్డాయి భారత్- న్యూజిలాండ్. అప్పుడు టీమిండియా కెప్టెన్​గా కోహ్లీ, కివీస్​కు విలియమ్సన్ సారథిగా ఉన్నాడు.

మళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మెగాటోర్నీలో అదే పోరుకు రంగం సిద్ధమైంది. అప్పుడు కివీస్​పై మూడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఫైనల్​లో దక్షిణాఫ్రికాపై నెగ్గి కప్పు కొట్టింది.

2008 అండర్-19 కెప్టెన్లుగా కోహ్లీ- విలియమ్సన్

ఆ రోజు జరిగిన మ్యాచ్​లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకొని 205 పరుగులు చేసింది. అండర్‌సన్‌(70), విలియమ్సన్‌(37) రాణించి భారత్‌కు ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించారు. అనంతరం వర్షం కురిసి డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 43 ఓవర్లకు 191 పరుగుల లక్ష్యాన్ని సవరించారు. కోహ్లీ(43), ఎస్‌పీ గోస్వామి(51) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు.

ప్రస్తుత ప్రపంచకప్​లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియాకు నాలుగో స్థానంలో ఉన్న కివీస్​కు మ్యాచ్​ జరగనుంది. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మరో సెమీఫైనల్​ మ్యాచ్​లో తలపడనున్నాయి. ఈ రెండింటిలో విజేతలుగా నిలిచిన జట్లు ఈ నెల 14న లార్డ్స్​లో జరిగే ఫైనల్​లో కప్పు కోసం పోటీ పడనున్నాయి.

ప్రపంచకప్​లో కోహ్లీ-విలియమ్సన్

ఇది చదవండి: హెలికాప్టర్ షాట్​ నేర్పిన మిత్రునికి ధోని ఏం చేశాడు?

ABOUT THE AUTHOR

...view details