తెలంగాణ

telangana

మాంచెస్టర్​లో వర్షం నిల్​... పరుగులు ఫుల్​

By

Published : Jun 16, 2019, 5:54 PM IST

ప్రపంచకప్​లో భాగంగా మాంచెస్టర్​లో భారత్​-పాకిస్థాన్ మధ్య మ్యాచ్​ జరుగుతోంది.​ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నడుమ పూర్తిస్థాయి మ్యాచ్‌ కొనసాగే అవకాశాలున్నాయి. ఘనంగా ఆరంభమైన ఈ పోరు​లో భారీగా పరుగుల వరద పారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మాంచెస్టర్​లో వర్షం నిల్​... పరుగులు ఫుల్​

మాంచెస్టర్​లోని ఓల్డ్‌ ట్రెఫోర్డ్‌ స్టేడియం పిచ్​ సాధారణంగా పేసర్లకు అనుకూలిస్తుంది. కానీ ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్​ చూస్తే బ్యాట్స్​మెన్ బాగానే పరుగులు చేస్తున్నారు. రోహిత్​ శతకంతో, రాహుల్​ అర్ధశతకంతో అదరగొట్టారు. పాకిస్థాన్​ స్పిన్నర్లను ఓ ఆటాడుకుంటూ కోహ్లీసేన రన్స్​ చేస్తోంది. ఇదే నిలకడ ప్రదర్శిస్తే టీమిండియా... ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచే అవకాశం ఉంది.

ఈ స్టేడియంలో ఇప్పటివరకు అత్యధిక స్కోర్‌ ఇంగ్లాండ్‌ X శ్రీలంక మధ్య 318/7గా నమోదైంది. అత్యల్ప స్కోర్​ ఇంగ్లాండ్‌ x కెనడా మధ్య 45/10 రికార్డు ఉంది. అయితే ఇదే ఆతిథ్య జట్టు-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన పోరులో 286/4 అత్యధిక ఛేదనగా నిలిచింది.

మ్యాచ్​ సమయంలో వరుణుడు విజృంభించే అవకాశం ఉందని తొలుత అందరూ ఆందోళన చెందినా... అలా జరగలేదు. ప్రస్తుతం మ్యాచ్​ సజావుగానే సాగుతోంది. వర్షం కురవకపోతే పూర్తిస్థాయి ఆట జరిగే అవకాశముంది. ఇప్పటికే వరుణుడు కారణంగా ఈ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details