తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పిల్లలూ ఆటలు ఎంచుకోవద్దు.. హాయిగా ఉండండి'

న్యూజిలాండ్ ఆల్​రౌండర్ జిమ్మీ నీషమ్​ పిల్లలను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఆటలను ఎంచుకోవద్దు అంటూ పోస్ట్ చేశాడు. ప్రపంచకప్​లో కివీస్ ఉత్కంఠ పోరులో ఓడిన తర్వాత ఈ ట్వీట్ చేశాడు.

By

Published : Jul 15, 2019, 5:15 PM IST

నీషమ్

ఇంగ్లాండ్ చేతిలో పరాజయం చెందిన న్యూజిలాండ్ క్రికెటర్ల బాధ వర్ణణాతీతం. ఈ ఓటమి తర్వాత కివీస్ ఆల్​రౌండర్​ జిమ్మీ నీషమ్ పిల్లలను ఉద్దేశిస్తూ ఓ సందేశం షేర్ చేశాడు. ఆటలను ఎంచుకోవద్దు అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

"పిల్లలూ ఆటలను ఎంచుకోకండి. వేరే ఏదైనా పని చేసుకుని బతకండి. సంతోషంగా 60 ఏళ్లు బతికి తర్వాత చనిపోయినా సమస్య ఉండదు" - జిమ్మీ నీషమ్ ట్వీట్​​.

నీషమ్ ట్వీట్​

నీషమ్​కు మద్దతుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. అద్భుతంగా ఆడారు అంటూ ప్రశంసిస్తున్నారు.

"కప్​ గెలవకపోయినా కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నారు" అంటూ ఒకరు పోస్ట్ చేశారు.

నెటిజన్లు స్పందన

"విజేతలుగా నిలిచిన వారికి మీరు ఏ మాత్రం తక్కువ కాదు" అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

నెటిజన్ల స్పందన

"నీ సిక్స్​ చూసి చచ్చిపోవాలనిపించింది. అంత బాగా ఆడావ్" అంటూ మరొకరు పోస్ట్ చేశారు.

నెటిజన్లు స్పందన

లార్డ్స్​ వేదికగా ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్​లో నీషమ్ అద్భుతంగా ఆడి 14 పరుగులు చేశాడు. అయితే సూపర్​ ఓవర్లోనూ మ్యాచ్ టై అవ్వగా.. బౌండరీ కౌంట్​ ద్వారా ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని నీషమ్ ఆవేదనను ఈ ట్వీట్ ద్వారా తెలియజేశాడు.

ఇది చదవండి: WC19: ఇంగ్లాండ్​కు కప్పు తెచ్చిన దత్తపుత్రులు!

ABOUT THE AUTHOR

...view details