తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అన్ని సార్లూ వాళ్లే ఆడాలంటే ఎలా?'

భారత్ బ్యాటింగ్ రోహిత్, కోహ్లీలపైనే ఎక్కువగా ఆధారపడుతోందని, అన్నీ సార్లు వాళ్లు ఆడలేకపోవచ్చని సచిన్ తెందూల్కర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఓటమి తనకు నిరాశ కలిగించిందని చెప్పాడు.

By

Published : Jul 11, 2019, 6:20 AM IST

సచిన్

న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్ మ్యాచ్​లో భారత్ ఓటమిపై మాస్టర్ బ్లాస్టర్​ సచిన్ తెందూల్కర్ స్పందించాడు. జడేజా, ధోని అద్భుతంగా ఆడారని, వారి పోరాటపటిమను ప్రశంసించాడు. అయితే భారత బ్యాటింగ్​ టాపార్డర్​పైనే ఆధారపడుతోందని, మిగతా వారు బాధ్యత తీసుకోవాల్సి ఉందన్నాడు.

"మ్యాచ్ చూసి నాకు చాలా నిరాశ కలిగింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి అనుమానం లేకుండా ఛేదించే వీలుంది. న్యూజిలాండ్ మొదట్లోనే 3 వికెట్లు తీసి భారత అభిమానుల కలలను ఆవిరి చేసి ఉండొచ్చు. కానీ బ్యాటింగ్​లో ఎప్పుడూ టాపార్డర్​పైనే ఆధారపడుతోంది టీమిండియా. ప్రతీ సారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బలమైన పునాది వేయలేకపోవచ్చు. మిగతా వారు కూడా బాధ్యత తీసుకోవాలి" -సచిన్ తెందూల్కర్

అన్నీ సార్లు ధోని వచ్చి ముగించాలనుకోవడం సరికాదని మాస్టర్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు. విలియమ్సన్ వ్యూహాలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాడు.

మాంచెస్టర్ వేదికగా కివీస్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 18 పరుగలు తేడాతో ఓడి మెగాటోర్నీ నుంచి నిష్క్రమించింది. జడేజా (77), ధోని (50) అర్ధశతకాలతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.

ఇది చదవండి: కోహ్లీ, ధోని అప్పుడు ఇప్పుడు ఒకేలా..!

ABOUT THE AUTHOR

...view details