తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: ఆసీస్​పై శిఖర్ శతకం బాదేశాడు

లండన్ ఓవల్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో భారత్ ఓపెనర్ ధావన్ శతకంతో అదరగొట్టాడు. 95 బంతుల్లో 100 పరుగులు పూర్తిచేశాడు.

By

Published : Jun 9, 2019, 5:38 PM IST

శిఖర్ ధావన్​

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ 14వ మ్యాచ్​లో భారత్ భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ శిఖర్​ ధావన్ శతకంతో ఆకట్టుకున్నాడు. 95 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి కెరీర్​లో 17వ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి. ధావన్​కు ఈ మైదానంలో ఇది మూడో శతకం.

టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ధావన్, రోహిత్(57) నిలకడగా ఆడారు. శిఖర్ ధాటిగా బ్యాటింగ్ చేయగా... రోహిత్​ సమయోచితంగా ఆడుతూ స్కోరు వేగం పెంచాడు. వీరిద్దరూ తొలి వికెట్​కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అర్ధశతకం చేసి రోహిత్.. కౌల్టర్ నైల్ బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, ధావన్ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details