తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​లోనూ భారత్ అభిమానులదే హవా

క్రికెట్ ప్రపంచకప్​లో టీమిండియాకు మద్దతు తెలిపేందుకు సుమారు 80 వేల మందికి పైగా అభిమానులు భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వచ్చారని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ థాంప్సన్ తెలిపారు.

By

Published : Jul 1, 2019, 5:11 PM IST

ఇంగ్లండ్ లోనూ భారత్ అభిమానులదే హవా

ప్రపంచకప్​లో టీమిండియా ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తోంది. ఇంగ్లాండ్ మినహా అన్ని జట్లపైనా విజయాలు సాధించింది. కోహ్లీసేనకు మద్దతు తెలిపేందుకు టోర్నీ అతిథ్యమిస్తోన్న ఇంగ్లండ్​కు వేల సంఖ్యలో భారత అభిమానులు చేరుకున్నారు. వీరు సుమారుగా 80 వేల మందిపైగా ఉంటారని బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ జాన్ థాంప్సన్ సోమవారం వెల్లడించారు.

భారత క్రికెట్ జట్టు

"మా అంచనా ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్​లు చూసేందుకు భారత్ నుంచి సుమారు 80వేల మంది ఇక్కడికి వచ్చారు. ఈ సమయానికి సాధారణంగా పర్యటకుల రద్దీ ఉంటుంది. ఇది ఇంకా పెరగడానికి మరో కారణం క్రికెట్" -జాన్ థాంప్సన్, బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్

మే 30 నుంచి ప్రారంభమైంది వన్డే క్రికెట్ ప్రపంచకప్. ఇప్పటికే మ్యాచులన్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. మైదానాల్లో ఎక్కువగా భారతదేశానికి చెందిన అభిమానులే కనిపిస్తుండటం విశేషం. జూలై 14న లార్డ్స్ మైదానంలో ఫైనల్ జరగనుంది.

ఇది చదవండి: ప్రపంచకప్​ నుంచి విజయ్ శంకర్ ఔట్

ABOUT THE AUTHOR

...view details