భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దీపక్ చాహర్. నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే ఈ ఆటగాడికి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడమంటే తేలికగా ఉంటుందట.
"చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం తేలికగా ఉంటుందని గ్రహించా. పవర్ప్లేలో బౌండరీ లైన్ వద్ద ఇద్దరు ఫీల్డర్లే ఉంటారు. డెత్ ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లకు అవకాశం ఉంటుంది. అందుకే అప్పుడు బౌలింగ్ చేయడం సులభమవుతుంది."
-దీపక్ చాహర్, టీమిండియా బౌలర్
ఐపీఎల్ వల్ల మెరుగైన ప్రదర్శన చేస్తున్నానని తెలిపాడు చాహర్. టీ20 ప్రపంచకప్ గురించి ప్రశ్నించగా.. అందుకు ఇంకా ఏడాది ఉందని అన్నాడు. విరాట్ గొప్ప ప్లేయర్ అని కొనియాడాడు.