తెలంగాణ

telangana

By

Published : Dec 17, 2019, 4:58 PM IST

ETV Bharat / sports

సీనియర్​ సారథుల సలహాలు కోరుతున్న ప్రియమ్

అండర్​-19 ప్రపంచకప్​ గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది యువ టీమిండియా. ద్రవిడ్​ పర్యవేక్షణలోని ఈ జట్టు డిఫెండింగ్​ ఛాంపియన్​గా దక్షిణాఫ్రికా వెళ్తోంది. మెగాటోర్నీకి ఇంకా నెల సమయమే ఉండటం వల్ల పలు అంశాలపై సీనియర్​ సారథి పృథ్వీషా సలహాలు కోరాడు ప్రస్తుత కెప్టెన్​ ప్రియమ్​ గార్గ్​.

U19 World Cup 2020
ప్రపంచకప్​ కోసం సీనియర్​ సారథితో మంతనాలు

గతేడాది భారత జట్టు సాధించిన అండర్​-19 ప్రపంచకప్‌ టైటిల్‌ను నిలబెట్టేందుకు అప్పటి సారథి పృథ్వీషా సలహాలు కోరాడు ప్రస్తుత కెప్టెన్​ ప్రియమ్‌ గార్గ్‌. జట్టు ప్రణాళిక, ఆటగాళ్లను సమన్వయం చేయడం వంటి విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. త్వరలో టీమిండియా సారథి విరాట్​ కోహ్లీని కూడా కలవనున్నట్లు తెలిపాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది.

విరాట్​, పృథ్వీ షా

"పృథ్వీషాతో చాలా విషయాలు చర్చించాను. ప్రణాళిక రచించడం, కీలక సమయాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కొన్ని సూచనలు చేశాడు. ఆటగాళ్లు ఎంత దగ్గరైతే అంత బాగా ఆడతారని షా సూచించాడు. మొదట ఆటగాళ్ల బలాలేంటో గుర్తించాలని అన్నాడు. 2018లో ప్రపంచకప్‌ గెలిచేందుకు క్రికెటర్ల మధ్య అనుబంధమే కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్లుగా వెళుతున్న మాపై ఒత్తిడేమీ లేదు. అంతపెద్ద టోర్నీలో జట్టుకు సారథ్యం వహించడం నాకు పెద్ద అవకాశంగా భావిస్తున్నా. సారథిగా జట్టును ముందుకు తీసుకెళ్లడం, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం గురించి ఆలోచిస్తున్నా. త్వరలో విరాట్​ కోహ్లీని కలుస్తాను"

- ప్రియమ్‌ గార్గ్‌, టీమిండియా అండర్​-19 కెప్టెన్​

అండర్​-19 జట్టులోని ఆటగాళ్లు

గతంలో మహ్మద్ కైఫ్​(2000), విరాట్​కోహ్లీ(2008), ఉన్ముక్త్​ చంద్​(2012), పృథ్వీషా(2018) సారథ్యంలో భారత్​ నాలుగుసార్లు అండర్-19 ప్రపంచకప్​ విజేతగా నిలిచింది.

డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. న్యూజిలాండ్, శ్రీలంకతోపాటు అరంగేట్రం చేస్తున్న జపాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉండగా, ఆతిథ్య దక్షిణాప్రికా.. అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడాతో కలిసి గ్రూప్-డిలో ఉంది. ఈ టోర్నీలోమొత్తం 16 జట్లు తలపడనున్నాయి. టీమిండియా జట్టుకు ప్రియమ్ గార్గ్ సారథ్య బాధ్యతలు నిర్వహించనుండగా.. కీపర్ ధృవ్ చంద్ జురెల్ వైస్​ కెప్టెన్​గా ఉండనున్నాడు.

దిగ్గజ క్రికెటర్​, కోచ్​ ద్రవిడ్​తో ప్రియమ్​గార్గ్​

గ్రూపుల వారిగా జట్లు

  • గ్రూప్-ఎ: ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్
  • గ్రూప్-బి: ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, నైజీరియా
  • గ్రూప్-సి: పాకిస్థాన్, జింబాబ్వే, బంగ్లాదేశ్, స్కాట్లాండ్
  • గ్రూప్-డి: దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడా

భారత జట్టు...

ప్రియమ్ గార్గ్ (సారథి), ధృవ్​చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శాశ్వత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభంగ్ హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్ర (కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.

ఇవీ చూడండి...

ABOUT THE AUTHOR

...view details