తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత మహిళల సత్తా

ఐసీసీ మహిళా వన్డే ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఇంగ్లాండ్​తో సిరీస్ గెలిచిన భారత్ జట్టు టీం ర్యాంకింగ్స్​లో రెండో స్థానానికి చేరింది.

By

Published : Mar 4, 2019, 5:21 PM IST

భారత మహిళల జట్టు

ఐసీసీ మహిళా వన్డే ర్యాంకింగ్స్​లో భారత్ జట్టు సత్తాచాటింది. ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్ గెలుపొందినందున టీం ర్యాంకింగ్స్​లో రెండో స్థానానికి చేరింది. ఈ సిరీస్​లో 8 వికెట్లతో మంచి ప్రదర్శన కనబర్చిన జులాన్ గోస్వామి బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

బ్యాట్స్ ఉమెన్ ర్యాంకింగ్స్​లో స్మృతి మంధాన మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ మహిళా ఛాంపియన్​షిప్​లో 837 పరుగులతో ఆకట్టుకున్న ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమెన్ కెరీర్​లో ఉత్తమంగా 797 పాయింట్లకు చేరింది. బ్యాట్స్ ఉమెన్, బౌలింగ్ రెండు విభాగాల్లో భారత ఆటగాళ్లు మొదటి ర్యాంకులో నిలవడం ఇది రెండోసారి. 2012 మార్చిలో మిథాలీ, గోస్వామి ఈ ఘనత సాధించారు.

స్మృతి మంధాన

ప్రస్తుతం 218 వికెట్లతో వన్డేల్లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్​గా నిలిచిన గోస్వామి ఎక్కువ రోజులు టాప్ ర్యాంక్​లో ఉన్న క్రికెటర్​గా నిలవడానికి కొద్ది దూరంలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్ కేథరిన్ ఫిట్జ్ ప్యాట్రిక్ 2,113 రోజులు నంబర్ వన్ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం గోస్వామి 1,873 రోజుల వద్ద ఉంది. మరో బౌలర్ శిఖాపాండే 12 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

జులాన్ గోస్వామి
ర్యాంకింగ్స్​లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రపంచకప్​కు నేరుగా అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details