తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరీస్ చేజారింది..

ఇంగ్లండ్​ అమ్మాయిలు 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. వ్యాట్ అర్ధశతకంతో రాణించింది. బ్రంట్ మూడు వికెట్లు ఇంగ్లీష్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.

By

Published : Mar 7, 2019, 2:07 PM IST

భారత్ మహిళలు ఓటమి

ఇంగ్లండ్​తో జరిగిన రెండో టీ -ట్వంటీలోభారత మహిళా జట్టుపరాజయం పాలైంది. 112 పరుగుల లక్ష్య ఛేదన కోసంబరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ వ్యాట్ అర్ధ శతకంతో రాణించింది. మిగతా బ్యాట్స్ఉమెన్ విఫలమైనా.. లారెన్ వీన్​ఫీల్డ్(29) సహకారంతో భారత అమ్మాయిలకు గెలుపును దూరం చేసింది. 2-0 తేడాతో ఓ మ్యాచ్​ మిగిలి ఉండగానేటీ-ట్వంటీ సిరీస్​ను కైవసం చేసుకుంది ఇంగ్లండ్​.ఇటీవల కివీస్​తో జరిగిన టీ- ట్వంటీసిరీస్​నూకోల్పోయింది టీమిండియా.

అంతర్జాతీయంగా ఇది 600 టీ-ట్వంటీ.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు చేసింది. మిథాలీ రాజ్(20) మినహా ఎవరూ రాణించలేదు. మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. స్మృతి మంధానా(12) మరోసారి విఫలమైంది. ఇంగ్లీష్ బౌలర్ కేథరిన్ బ్రంట్ మూడు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించింది.

రాణించిన వ్యాట్

56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడింది ఇంగ్లండ్​ బ్యాట్స్​ఉమెన్​ వ్యాట్(64). వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పరుగులెత్తించింది. లోరెన్ సహాకారంతో ఇంగ్లండ్​ విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో ఏక్తాభిస్థ్​రెండు వికెట్లు తీసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details