తెలంగాణ

telangana

ETV Bharat / sports

చారిత్రక గెలుపుపై సచిన్ స్ఫూర్తిదాయక ట్వీట్

గబ్బా విజయానంతరం ప్రపంచానికి సందేశం ఇచ్చారు దిగ్గజం సచిన్ తెందూల్కర్. మరింత గొప్పగా రాణించేందుకే పరాజయాలు పలకరిస్తాయని అన్నారు.

By

Published : Jan 19, 2021, 5:21 PM IST

Updated : Jan 19, 2021, 5:48 PM IST

sachin message to the world after glorious victory of india over australia
చారిత్రక గెలుపుపై.. సచిన్ స్ఫూరిదాయక ట్వీట్

ఆస్ట్రేలియాపై భారత జట్టు చారిత్రక గెలుపు తర్వాత స్ఫూర్తిదాయక ట్వీట్​ చేశారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్. అపజయాలతో కుంగిపోవద్దని, ఆపదలో దన్నుగా నిలచినవారితో విజయోత్సవాలను జరపుకోవాలని సూచించారు.

"భారత్‌కే కాదు, ప్రపంచానికి ఓ విషయం చెబుతున్నా. మీరు 36 పరుగులు లేదా అంతకంటే తక్కువ స్కోరుకు వెనుదిరిగితే.. అది అంతం కాదు. మరింత గొప్పగా దూసుకెళ్లడానికే కాస్త వెనక్కి వెళ్తున్నారంతే. అయితే గెలిచిన తర్వాత మీకు అండగా నిలిచిన వాళ్లతో సంబరాలు చేసుకోవడం మరిచిపోవద్దు."

-సచిన్ తెందూల్కర్, భారత మాజీ క్రికెటర్

ప్రతి సెషన్‌లో ఓ హీరో పుట్టుకొచ్చాడని వ్యాఖ్యానించారు సచిన్. "ధైర్యంగా ఆడాం. బాధ్యతారహితమైన క్రికెట్ ఆడలేదు. గాయాలు, ఇతర ప్రతికూలతల్ని అధిగమించి గొప్ప సిరీస్‌ను గెలిచాం. భారత్‌కు అభినందనలు" అని తెందూల్కర్ ట్వీట్ చేశారు.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటైంది టీమ్​ఇండియా. ఆ సమయంలో టీమ్ఇండియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన మెల్​బోర్న్​ టెస్టులో విజయం, సిడ్నీలో డ్రా, గబ్బాలో గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయించింది భారత్.

ఇదీ చూడండి:గబ్బాలో 'యువ'గర్జన- టీమ్​ఇండియాకు ప్రశంసల వెల్లువ

Last Updated : Jan 19, 2021, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details