తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ-20: రొమేనియా రికార్డ్​- శతకం కొట్టిన భారతీయుడు

అంతర్జాతీయ టీ-20ల్లో ప్రపంచ రికార్డు నమోదైంది. టర్కీతో జరిగిన మ్యాచ్​లో రొమేనియా 173 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. భారత్​కు చెందిన శివకుమార్ (105) రొమేనియా తరఫున అద్భుత శతకం సాధించి జట్టును గెలిపించాడు.

By

Published : Aug 31, 2019, 11:03 AM IST

Updated : Sep 28, 2019, 11:04 PM IST

రొమేనియా

టీ-20ల్లో అత్యధిక పరుగుల తేడాతో (172) గెలిచిన దేశంగా శ్రీలంక పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది రొమేనియా జట్టు. రొమేనియా కప్​లో టర్కీతో జరిగిన మ్యాచ్​లో 173 పరుగుల తేడాతో విజయం సాధించింది. తమిళనాడులో పుట్టిన శివకుమార్ పెల్వియార్ (105, 40 బంతుల్లో) శతకంతో అదరగొట్టి రొమేనియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన రొమేనియా నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన టర్కీ 53 పరుగులకే ఆలౌటైంది. రాజేంద్ర పిసాల్, కాస్మిన్ జేవియూ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు.

అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన టాప్ -5 జట్లు

విజేత ప్రత్యర్థి పరుగుల తేడా సంవత్సరం
రొమేనియా టర్కీ 173 2019
శ్రీలంక కెన్యా​ 172 2007
పాకిస్థాన్ వెస్టిండీస్ 143 2018
భారత్ ఐర్లాండ్ 143 2018
ఇంగ్లాండ్ వెస్టిండీస్ 137 2019

రొమేనియాలో భారత్ పంచ్..

ఈ మ్యాచ్​లో శివకుమార్ 40 బంతుల్లో 105 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 5వ స్థానంలో బ్యాటింగ్​కు దిగి అద్భుత శతకం చేయడం విశేషం.

భారత్​ తమిళనాడులో పుట్టి పెరిగిన శివకుమార్ అండర్-15, అండర్-22, అండర్-25 టోర్నమెంట్లలో ఆడాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా 2015లో రొమేనియాలో స్థిరపడ్డాడు 31 ఏళ్ల శివకుమార్. క్రికెట్ మీద ఇష్టంతో ఆ దేశంలోని క్లజ్ క్రికెట్ క్లబ్​లో చేరి మ్యాచ్​లు ఆడుతూ సత్తాచాటుతున్నాడు.

ఇది చదవండి: ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన పీవీ సింధు

Last Updated : Sep 28, 2019, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details