తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2020, 5:51 PM IST

ETV Bharat / sports

ఆసీస్​తో వన్డేకు ముందు రోహిత్ శర్మకు గాయం!

ఈనెల 14న ఆస్ట్రేలియాతో భారత్.. తొలి వన్డే ఆడనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందే రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది.

Rohit Sharma
రోహిత్ శర్మ

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్​లో గాయపడ్డాడని సమాచారం. ఆస్ట్రేలియాతో సిరీస్​కు ముందు ఈ వార్త.. భారత శిబిరంలో ఆందోళన రేపుతోంది.

శ్రీలంకతో టీ20 సిరీస్​కు విరామం తీసుకున్నాడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాతో ఈనెల 14 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్​ కోసం ప్రాక్టీస్​ చేస్తున్నాడు. ముంబయి వాంఖడే మైదానంలో ఇతడు ప్రాక్టీస్ చేస్తుండగా చేతి బొటనవేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు టీమిండియాతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన పెంచుతోంది.

రోహిత్ శర్మకు గాయం

గతేడాది వన్డేల్లో అద్భుత ఫామ్ కనబర్చిన రోహిత్.. క్యాలెండర్ ఇయర్​లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఇవీ చూడండి.. బిగ్​బాష్​ లీగ్​లో రికార్డుల మోత.. ఒకేసారి రెండు

ABOUT THE AUTHOR

...view details