టీమిండియా టెస్టు క్రికెటర్ ఫృథ్వీషా డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా 8 నెలల తాత్కాలిక నిషేధానికి గురయ్యాడు. ఇతడితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. బీసీసీఐ సంబంధిత ప్రకటనను విడుదల చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఈ ముగ్గురు క్రికెటర్ల నుంచి సేకరించిన యూరిన్ శాంపిల్స్లో నిషేధిత డ్రగ్స్ వాడినట్లు తేలింది.
ఫృథ్వీషా తీసుకునే దగ్గు మందులో ఉన్న టెర్బుటలైన్ అనే కారకం వాడా నిషేధిత జాబితాలో ఉంది. బీసీసీఐ యాంటీ డోపింగ్ నియమాల ప్రకారం అతడ్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వివరణ ఇచ్చిన షా.. సిరప్ వేసుకునే క్రమంలో తనకు తెలియకుండా దీన్ని తీసుకున్నానని చెప్పాడు. ఈ విషయంపై సంతృప్తి చెందిన బీసీసీఐ, అతడికి 8 నెలల తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఏడాది నవంబరు 15 వరకు ఇది అమలులో ఉండనుంది.
ఇది చదవండి: భారత్ అమ్మాయితో పాక్ క్రికెటర్ హసన్ అలీ పెళ్లి..!