తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2020, 4:05 PM IST

Updated : Jan 4, 2020, 4:16 PM IST

ETV Bharat / sports

'4 రోజుల మ్యాచ్​ల వల్ల టెస్టు పవిత్రత దెబ్బతింటుంది'

నాలుగు రోజుల టెస్టు మ్యాచ్​లను నిర్వహించాలనే ఐసీసీ ప్రతిపాదనను విరాట్ కోహ్లీ వ్యతిరేకించాడు. ఈ విధానం వల్ల టెస్టు క్రికెట్ పవిత్రత దెబ్బతింటుందని చెప్పాడు.

Not in favour of four-day Tests, says India captain Kohli
విరాట్ కోహ్లీ

నాలుగు రోజుల టెస్టు మ్యాచ్​ను నిర్వహించాలనే ఐసీసీ ప్రతిపాదనను ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాడు. దీనివల్ల సంప్రదాయ ఐదు రోజుల క్రికెట్ పవిత్రతను హరించినట్లేనని అభిప్రాయపడ్డాడు.

"పింక్ బంతి టెస్టుతో సంప్రదాయ టెస్టులో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఈ విధానంతో​ వాణిజ్యపరంగా ఓ ముందడుగు పడినట్లయింది. టెస్టుల పట్ల ఉత్కంఠను, ఆసక్తిని కలగజేసింది. అయితే నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను మాత్రం నేను వ్యతిరేకిస్తా. పూర్తిగా వినోదం కోసమే మ్యాచ్​లు నిర్వహిస్తే.. భవిష్యత్తులో మూడు రోజుల టెస్టు గురించి చర్చించాల్సి ఉంటుంది. ఇలాగే కొనసాగితే టెస్టు ఫార్మాట్ కనుమరుగవుతుంది." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

క్రికెట్​లో ఇప్పటికే ఎన్నో మార్పు వచ్చాయని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

"టెస్టు క్రికెట్​లో రోజులను కుదించడం అంత సమంజసం కాదని నేను అనుకుంటున్నా. అలా చేస్తే 5 రోజుల ఫార్మాట్​ పవిత్రతను దెబ్బతీసినట్లే. ఇప్పటికే టీ20 క్రికెట్​తో కొత్త ఫార్మాట్​ వచ్చింది. ఇటీవలే 100 రోజుల ఆట గురించి ఎవరో నన్ను అడిగారు. అందులో నేను ఆడనని చెప్పేశా. ఎందుకంటే క్రికెట్​లో ఇప్పటికే ఎన్నో మార్పులు వచ్చాయి" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

2023 నుంచి 2031 వరకు 4 రోజుల టెస్టు మ్యాచ్​లను నిర్వహించాలని ఐసీసీ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఈ అంశంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

ప్రస్తుతం శ్రీలంకతో ఆదివారం నుంచి జరగనున్న టీ20 సిరీస్​కు సన్నద్ధమవుతున్నాడు కోహ్లీ. గుహవటి వేదికగా శ్రీలంకతో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నెల 7న ఇండోర్​లో రెండో టీ20 జరగనుంది. ఈ నెల 10న పుణె వేదికగా ఆఖరి టీ20 నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: 40 బంతులు ఒక్క పరుగు.. అందుకే 'ద వాల్' అయ్యాడు!

Last Updated : Jan 4, 2020, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details