ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ ముందుంటాడు. అతడు ఆటతో దేశానికి తెస్తున్న పేరును గుర్తించి.. సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్కు విరాట్ పేరు పెట్టనుంది.
"ప్రపంచ క్రికెట్లో కోహ్లీ చూపిస్తోన్న అసమాన ప్రతిభ అమోఘం. డీడీసీఏ ఈ విషయంపై చాలా ఆనందంగా ఉంది. విరాట్ ఎన్నో మైలురాళ్లు ఛేదించాడు. అతడి సారథ్య బాధ్యతలు సూపర్. విరాట్ ప్రతిభను మెచ్చుకుంటూ మైదానంలోని ఓ స్టాండ్కు కోహ్లీ పేరు పెడుతున్నాం. ఇది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం."
-- రజత్ శర్మ, డీడీసీఏ ప్రెసిడెంట్