తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఇప్పటికే ఇంగ్లండ్​పై వన్డే సిరీస్ గెలిచిన భారత మహిళా జట్టు..అదే ఊపును టీ20 సిరీస్​లోనూ  కొనసాగించాలని చూస్తోంది. గువహటి వేదికగా మొదటి మ్యాచ్​ జరుగుతోంది.

By

Published : Mar 4, 2019, 10:57 AM IST

మహిళల జట్టు

అసోం గువహటి వేదికగా మహిళల బారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టీ 20లో భారత్ టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెలుపొంది అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. స్మృతి మంధాన కెప్టెన్​గా వ్యవహరించనుంది.

ఇంతకు ముందు న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్​ 2-1తో గెలిచి, పొట్టి ఫార్మాట్​ను 0-3 తేడాతో ఓడిపోయింది ఉమెన్ ఇన్ బ్లూ.
టీ20 సారధి హర్మన్ ప్రీత్ కౌర్ మోకాలి గాయం నుంచి కోలుకోలేదు. దాంతో సూపర్ ఫాంలో ఉన్న స్మృతి మంధానకు కెప్టెన్​గాను నిరూపించుకునే అవకాశం లభించింది. కివీస్​ పర్యటనలో సెంచరీ, ఇంగ్లండ్​తో వన్డే సిరీస్​లో రెండు అర్ధ సెంచరీలు చేసిన ఆమె ఇప్పటికే బ్యాట్స్ ఉమెన్​గా విజయవంతమైంది.

హార్మన్ ప్రీత్ గైర్హాజరుతో అందరి కళ్లు మిథాలీ ​ఆటపైనే ఉండనున్నాయి. న్యూజిలాండ్​ పర్యటనలో ఆమెకు తొలి రెండు టీ20ల్లో అవకాశం లభించలేదు. మూడో మ్యాచ్​లో 24 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచింది. ఇక ఈ సిరీస్​లో ఎలా ఆడుతుందో చూడాలి.

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​కు ముందే ఆమె రిటైరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ సిరీస్​లో మిథాలీ అనుభవం జట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో...!

గతేడాది టీట్వంటీ ప్రపంచకప్​ తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇస్తోంది వేద కృష్ణమూర్తి. హర్లిన్ డియోల్, భారతి పుల్మలి తమ బౌలింగ్​ను నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోమల్ జంజడ్ ఈ సిరీస్​తో అరంగేట్రం చేస్తోంది. శిఖా పాండే పేస్ బౌలింగ్ బాధ్యతలు చూడనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details