తెలంగాణ

telangana

కరోనా రూల్స్ బ్రేక్ చేసిన కెప్టెన్లు

By

Published : Aug 6, 2020, 7:29 AM IST

Updated : Aug 6, 2020, 11:05 AM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో ఇరుజట్ల కెప్టెన్లు అలవాటులో పొరపాటుగా కరచాలనం చేశారు. దీంతో కరోనా నిబంధనలు అతిక్రమించినట్లయింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి పాక్ 139/2తో నిలిచింది.

పాక్-ఇంగ్లాండ్ కెప్టెన్లు కరోనా నిబంధనలు అతిక్రమణ
పాక్ ఇంగ్లాండ్ తొలి టెస్టు

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టును పాకిస్థాన్‌ మెరుగ్గా ఆరంభించింది. అయితే బయో బబుల్‌లో మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. కేవలం 49 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. బుధవారం, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌.. ఆట ఆఖరుకు 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బాబర్‌ అజామ్‌ (69 బ్యాటింగ్‌), షాన్‌ మసూద్‌ (46 బ్యాటింగ్‌) రాణించారు.

నిజానికి పాక్ ఓ దశలో 43 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. మసూద్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన అబిద్‌ అలీ (16)ని జట్టు స్కోరు 36 వద్ద ఆర్చర్‌ బౌల్డ్‌ చేశాడు. కాసేపటి తర్వాత అజహర్‌ అలీ (0)ని వోక్స్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ దశలో మసూద్‌తో కలిసిన బాబర్‌.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మాసూద్‌ సహనాన్ని ప్రదర్శిస్తే.. బాబర్‌ కాస్త దూకుడుగా ఆడాడు. చక్కని డ్రైవ్‌లతో అలరించాడు. బాబర్‌, మసూద్‌ జంట అభేద్యమైన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌కు కేవలం స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేసింది.

పాక్ బ్యాట్స్​మన్ బాబర్ అజామ్

కరోనా నిబంధనలు మర్చిపోయారు

తొలి టెస్టుకు ముందు నిర్వహించిన టాస్‌ కార్యక్రమంలో ఇరు జట్ల కెప్టెన్లూ అలవాటులో పొరపాటుగా కరచాలనం చేసుకున్నారు. దీంతో అజర్‌ అలీ, జోరూట్‌లు కరోనా నిబంధనలను అతిక్రమించినట్లు అయింది.

Last Updated : Aug 6, 2020, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details