తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి వన్డేకు ధోని దూరం..?

నెట్​ ప్రాక్టీస్​లో భారత మాజీ కెప్టెన్​ ధోనికి గాయమైంది. మహీ కోలుకోకుంటే తొలి వన్డేలో రిషబ్​ పంత్​ వికెట్​కీపింగ్​ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

By

Published : Mar 1, 2019, 4:38 PM IST

మహేంద్ర సింగ్ ధోని

హైదరాబాద్​ ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియా- భారత్ మధ్య జరగనున్న తొలి వన్డేకు ముందు కోహ్లీసేనకు ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్​లో ఉన్న భారత సీనియర్​ ఆటగాడు, మాజీ కెప్టెన్​ ధోనీకి గాయమైంది. నెట్​ ప్రాక్టీస్​లో జట్టు సభ్యుడు రాఘవేంద్ర వేసిన బంతి ధోని మోచేయికి తగిలింది.

చికిత్స అనంతరం ధోని కొంచెం ఇబ్బందిగానే కనిపించాడు. ఈ తరుణంలో మ్యాచ్​ ఆడే అవకాశం సంక్షిష్టంగా మారింది. ఒకవేళ మహీ ఆసీస్​తో తొలి వన్డేకు అందుబాటులో లేకుంటే వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకునే అవకాశం ఉంది. త్వరలో ఈ విషయంపై జట్టు యాజమాన్యం స్పష్టత ఇవ్వనుంది.

ప్రపంచకప్​కు ముందు చివరి సిరీస్ ఆడనుంది టీమిండియా. కంగారూలతో 5 వన్డేల సిరీస్​ రేపే ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ 20 సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన వన్డేల్లో నెగ్గాలనే పట్టుదలతో ఉంది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా తొలి వన్డే మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details