తెలంగాణ

telangana

By

Published : Dec 23, 2019, 4:58 PM IST

Updated : Dec 23, 2019, 7:00 PM IST

ETV Bharat / sports

రోహిత్​కు విశ్రాంతి.. బుమ్రా, ధావన్ పునరాగమనం

జనవరిలో ప్రారంభమయ్యే శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్​లకు జట్టును ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. లంకతో టీ20లకు రోహిత్​కు విశ్రాంతినివ్వగా బుమ్రా, శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చారు.

Bumrah
మ్యాచ్

జనవరిలో ప్రారంభమయ్యే శ్రీలంక, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్​లకు టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్ చోటు దక్కించుకున్నారు. వెన్నుగాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా తాజాగా జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్​కు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు.

"శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్​లకు బుమ్రాతో పాటు ధావన్​ను ఎంపిక చేశాం. రోహిత్ శర్మ, మహ్మద్ షమీలకు లంకతో జరిగే టీ20 సిరీస్​కు విశ్రాంతినిచ్చాం. ఈ సిరీస్​లో బ్యాకప్ ఓపెనర్​గా సంజు శాంసన్​కు చోటు కల్పించాం."
-ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్

జనవరి 5నుంచి శ్రీలంకతో మూడు టీ20లు ఆడనుంది టీమిండియా. జనవరి 14న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.

శ్రీలంకతో టీ20 సిరీస్​కు జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, శివం దూబే, చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​కు జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (కీపర్), కేదార్ జాదవ్, శివం దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా

ఇవీ చూడండి.. మిస్టర్ కూల్ క్రికెట్ ప్రస్థానానికి 15 ఏళ్లు

Last Updated : Dec 23, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details