తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2019, 9:36 AM IST

ETV Bharat / sports

'ఆటను అర్థం చేసుకుంటే ఎందులోనైనా ఆడొచ్చు'

ఆడే ప్రతి మ్యాచ్​ గెలవాలనుకుంటానని చెప్పాడు టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్. ఆటను అర్థం చేసుకుంటే ఏ ఫార్మాట్లోనైనా రాణించొచ్చని అన్నాడు. విండీస్​తో మూడు వన్డేల సిరీస్​కు ఎంపికయ్యాడీ బెంగళూరు బ్యాట్స్​మన్.

Basics remain the same: Mayank Agarwal on adapting to different formats
'ఆటను అర్థం చేసుకుంటే ఎందులోనైనా ఆడొచ్చు'

మయాంక్ అగర్వాల్.. ఆరు నెలల క్రితం వరకు భారత వన్డే క్రికెట్​ జట్టులో స్థానం దక్కితే గొప్ప విషయం అతడిది.. కట్ చేస్తే మూడు పార్మాట్లలోనూ ఆడే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఇటీవల టెస్టు సిరీస్​లో తనదైన శైలిలో విజృంభించి తాజాగా విండీస్​తో వన్డే సిరీస్​కు ఎంపికయ్యాడు. ఎరుపు బంతి క్రికెట్​ నుంచి తెల్ల బంతికి ఏ విధంగా మారాడో చెప్పాడు మయాంక్.

"మనస్ఫూర్తిగా క్రికెట్ ఆడలేకపోతే.. అసలు ఆట ఆడకుండా ఉంటేనే మంచిది. అదే నేను నమ్ముతా. క్రికెట్​లో ఏ ఫార్మాట్లోనైనా మూలాలు ఒకేలా ఉంటాయి. ఫార్మాట్​ మారినప్పుడు గేమ్ ప్లాన్ స్పష్టంగా ఉండి.. ఆటను అర్థం చేసుకోగలిగితే ఎందులోనైనా రాణించగలం. మ్యాచ్​ ఆడేటప్పుడు జట్టుకు నేనెలా ఉపయోగపడగలను, ఏ మేరకు ఆకట్టుకోగలను అనేదే ఆలోచిస్తా. ఒకవేళ నేను పరుగులు చేయనప్పటికీ.. ఫీల్డింగ్​లో సత్తాచాటేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా" -మయాంక్ అగర్వాల్, టీమిండియా క్రికెటర్.

తాను ఆడే ప్రతి మ్యాచ్​ గెలవాలనుకుంటానని, ఆ తలంపుతోనే బరిలోకి దిగుతానని చెప్పాడు మయాంక్ అగర్వాల్. అయితే ప్రతి మ్యాచ్​లో 100 శాతం ఆడతామనే గ్యారెంటీ లేదని, మంచి ప్రదర్శన చేసేందుకు చూడాలని తెలిపాడు.

టెస్టుల్లో ఆడిన చివరి ఆరు ఇన్నింగ్స్​ల్లో మూడు శతకాలు చేశాడు మయాంక్​ అగర్వాల్. ఇందులో రెండు డబుల్ సెంచరీలు(215, 243) ఉన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్​తో జరిగిన పింక్ టెస్టులో రెండో ద్విశతకం నమోదు చేశాడు.

ఇదీ చదవండి: 'కూర్పు'లో నిలిచి తుదిజట్టులో ఉండేదెవరో..!

ABOUT THE AUTHOR

...view details