తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​ సినిమాతో జాన్వీ టాలీవుడ్​ ఎంట్రీ!

దర్శకుడు త్రివిక్రమ్​-హీరో మహేశ్​ బాబు కాంబోలో రానున్న కొత్త సినిమాతో తన కుమార్తె జాన్వీ కపూర్​ను టాలీవుడ్​కు పరిచయం చేయాలని ప్రముఖ నిర్మాత బోణీకపూర్​ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

By

Published : May 23, 2021, 7:42 AM IST

janvi
జాన్వీ

బాలీవుడ్​ నటి జాన్వీ కపూర్​.. టాలీవుడ్​ ఎంట్రీ కోసం పలువురు దర్శకనిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు గతంలో ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోణీ కపూర్​ అన్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్​-సూపర్​స్టార్​ మహేశ్​బాబు కాంబోలో రాబోయే కొత్త సినిమాతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని ​చిత్రసీమలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నెట్టింట్లోనూ ఇదే హాట్​ టాపిక్​ అయింది. ఒకవేళ ఇదే నిజమైతే జాన్వీ ఎంట్రీ గ్రాండ్​గా ఉండొచ్చు.

జాన్వీ కపూర్​

మహేశ్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. ఇందులో మహేశ్​ 'రా' ఏజెంట్​గా కనిపించనున్నారని సమాచారం. హీరోయిన్​గా నిధి అగర్వాల్​ను తీసుకోవాలని చిత్రబృందం యోచిస్తోందని అంతకుముందు ప్రచారం సాగింది. మరోవైపు ఈ సినిమాకు 'పార్థు' అనే టైటిల్​ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 'పార్థు' అనగానే గుర్తొచ్చేది త్రివిక్రమ్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'అతడు' చిత్రంలో మహేశ్​ పాత్ర పేరు. ఇప్పుడిదే పేరును కొత్త చిత్ర టైటిల్​గా పెట్టాలని త్రివిక్రమ్​ భావిస్తున్నారట.

మహేశ్​ త్రివిక్రమ్​

ప్రస్తుతం మహేశ్​​.. పరశురామ్​ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి: స్టన్నింగ్​ ​లుక్స్​తో మతి పోగొడుతున్న తారలు

ABOUT THE AUTHOR

...view details