తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2020, 5:59 AM IST

Updated : Feb 29, 2020, 8:52 AM IST

ETV Bharat / sitara

ఈసారి 'రంగస్థలం'కు మించిన కథతో!

టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్... మెగాహీరో రామ్​చరణ్​తో మరోసారి కలిసి పనిచేయనున్నాడనే వార్త ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.

ukumar on what compelled him to make Rangasthalam and how Ram Charan took him by surprise
ఈసారి 'రంగస్థలం'కు మించిన కథతో!

మెగాపవర్​స్టార్ రామ్​చరణ్ 'రంగస్థలం' ఎంత పెద్ద హిట్​గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాకుండా ఓవర్సీస్​లోనూ దుమ్మురేపింది. నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. అయితే మరోసారి ఇంతకు మించిన కథతో, ఇదే హీరోతో సినిమా చేయనున్నాడట దర్శకుడు. ఇదే విషయమై ప్రస్తుతం సోషల్​ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈసారి 'రంగస్థలం'కు మించిన కథతో!

ప్రస్తుతం అల్లు అర్జున్​తో ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్య కథతో సినిమా చేస్తున్నాడు సుకుమార్. విజయ్ సేతుపతి విలన్​గా, రష్మిక హీరోయిన్​గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే చరణ్​-సుక్కుల సినిమా ప్రారంభం కావొచ్చు.

ఇదీ చదవండి: అందుకే ఆ సన్నివేశాల్లో నటించా: రాశీఖన్నా

Last Updated : Feb 29, 2020, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details