తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2020, 11:55 AM IST

ETV Bharat / sitara

నా సినిమా వస్తే టీవీ కట్టేస్తా.. కారణం అదే:త్రివిక్రమ్

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. తన సినిమాల్ని టీవీలో అసలు చూడడు. అందుకు గల కారణాన్ని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

నా సినిమా వస్తే టీవీ కట్టేస్తా.. కారణం అదే:త్రివిక్రమ్
దర్శకుడు త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్​లో రూపొందిన చిత్రం 'అల వైకుంఠపురములో'. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా ప్రచారంలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు, ఆసక్తికర సమాధానం ఇచ్చాడీ డైరెక్టర్. తన సినిమాలు.. టీవీలో అసలు చూడనని, వస్తే వెంటనే కట్టేస్తానని అన్నాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- హీరో అల్లు అర్జున్

"నేను నా సినిమాలు టీవీలో చూడను. ఒకవేళ మా ఆవిడ చూస్తే, అప్పుడు టీవీ కట్టేస్తాను. ఎందుకంటే వాటిలో నాకు తప్పులు కనిపిస్తాయి" -త్రివిక్రమ్, దర్శకుడు

ఇటీవలే విడుదలైన 'అల వైకుంఠపురములో' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. టబు, సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ అందించిన పాటలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇది చదవండి: 'సైరా'లో తమన్నా నటనకు త్రివిక్రమ్ ఫిదా

ABOUT THE AUTHOR

...view details