తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 7:08 PM IST

ETV Bharat / sitara

'పౌర' నిరసనకు సిద్ధమైన నటుడు ఫర్హాన్ అక్తర్

పౌరసత్వ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలపై బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్​ స్పందించాడు. ఇకపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు తెలిపే సమయం ముగిసిందని.. తాను నేరుగా ముంబయిలోని ఓ మైదానంలో ఆందోళన చేపట్టనున్నట్టు స్పష్టం చేశాడు.

farhan akhtar bollywood
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశంలో చెలరేగుతున్న నిరసనలపై బాలీవుడ్​ నటుడు ఫర్హాన్​ అక్తర్ స్పందించాడు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళనలు చేసే సమయం ముగిసిందని అన్నాడు. ఈ గురువారం.. ముంబయిలోని ఆగస్టు క్రాంతి మైదానంలో జరిగే నిరసన కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశాడు.

"ముంబయిలోని ఆగస్టు క్రాంతి స్టేడియంలో ఈనెల 19న కలుద్దాం. సోషల్​మీడియా వేదికగా నిరసనలు తెలిపేందుకు ఇక సమయం ముగిసింది" -ఫర్హాన్​ అక్తర్​, బాలీవుడ్​ నటుడు

పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం.. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై దిల్లీ పోలీసులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయంపై ఫర్హాన్​ ఖాన్​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతడితో పాటు ప్రముఖ సినిమా స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్, నటుడు మహ్మద్ జీషన్, పరిణీతి చోప్రా, సిద్ధార్థ్​ మల్హోత్రా, నిర్మాతలు విశాల్ భరద్వాజ్, అనురాగ్ కశ్యప్​, హాలీవుడ్ నటుడు జాన్ కుసాక్.. యువతపై పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు.

మతపరమైన సమస్యలను ఎదుర్కొంటూ పాకిస్థాన్​, బంగ్లాదేశ్​​, అఫ్గానిస్తాన్​ దేశాల నుంచి భారత్​కు వలస వచ్చిన వారికి పౌరసత్వ కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. 2014 డిసెంబరు 31వరకు దేశంలోకి ప్రవేశించిన వారిని ఇకపై అక్రమ వలసదారులగా గుర్తించకుండా వారికి పౌరసత్వం లభించేలా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు.. చట్టంగా మారింది.

ఇది చదవండి: పౌరసత్వ చట్ట సవరణ అమలుపై వెనక్కి తగ్గేది లేదు: కేంద్రమంత్రి అమిత్ షా

ABOUT THE AUTHOR

...view details