తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చంపడమో.. చావడమో కాదు గెలవడం ముఖ్యం'

'సైరా: నరసింహారెడ్డి' రెండో ట్రైలర్ నేడు విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో నయనతార, తమన్నా కథానాయికలు. అక్టోబరు 2న విడుదల కానుందీ సినిమా.

By

Published : Sep 26, 2019, 12:06 PM IST

Updated : Oct 2, 2019, 1:50 AM IST

సైరా నరసిహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా: నరసింహారెడ్డి' రెండో ట్రైలర్ నేడు (గురువారం) విడుదలైంది. అద్భుత యాక్షన్ సన్నివేశాలతో ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకొన్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొదటి ట్రైలర్​లో ప్రధాన పాత్రల పరిచయాలు, భావోద్వేగాలను ఎక్కువగా చూపించగా.. రెండో ట్రైలర్​లో యాక్షన్ సన్నివేశాలపై దృష్టిపెట్టారు. 'చంపడమో, చావడమో ముఖ్యం కాదు.. గెలవడం ముఖ్యం' లాంటి సంభాషణ​లు ఆకట్టుకుంటున్నాయి. చివరలోస్వాతంత్య్రంపైచిరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

అమితాబ్​ బచ్చన్​, జగపతి బాబు, విజయ్​ సేతుపతి, సుదీప్ లాంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నయనతార, తమన్నా కథానాయికలు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్​పై రామ్​చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ఇదీ చదవండి: చిరు నవ్వుతో చెరగని ముద్రవేసిన వేణు మాధవ్

Last Updated : Oct 2, 2019, 1:50 AM IST

ABOUT THE AUTHOR

...view details