తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2019, 8:30 AM IST

ETV Bharat / sitara

సల్మాన్​తో పోటీ తప్పడం ఆనందమే: అక్షయ్​

బాలీవుడ్​ ఖిలాడీ అక్షయ్​ కుమార్​ నటిస్తోన్న చిత్రం 'సూర్యవంశీ'. ఈ సినిమా సల్మాన్​ నటిస్తోన్న 'ఇన్షాల్లా'తో బాక్సాఫీస్​ వద్ద వచ్చే ఈద్​కు పోటీపడేలా కనిపించింది. తాజాగా 'సూర్యవంశీ'ని మార్చి 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

సల్మాన్​తో పోటీ తప్పడం ఆనందమే: అక్షయ్​

బాలీవుడ్​ స్టార్​ హీరోలు అక్షయ్​కుమార్​, సల్మాన్​ ఖాన్​ మధ్య పోటీ తప్పింది. వచ్చే ఏడాది ఈ ఇద్దరి సినిమాలు ఈద్​ సందర్భంగా విడుదల చేద్దామని భావించారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద వీరి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ విడుదల తేదీని కాస్త ముందుకు జరిపి మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఖిలాడీ హీరో. 'సూర్యవంశీ' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు అక్షయ్.

సల్మాన్​ హీరోగా 'ఇన్షాల్లా' చిత్రాన్ని సంజయ్​ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్​ కానుకగా రానుంది. ఈ ఏడాది ఈద్​ పండుగకు వచ్చిన ఈ కండల వీరుడి 'భారత్'​ ఘనవిజయం సాధించింది.

సూర్యవంశీ, ఇన్షాల్లా సినిమా ప్రకటన

" సల్మాన్​, నా సినిమా ఒకే సమయానికి రాకపోవడం శుభ పరిణామం. ఇద్దరి మధ్య పోటీ తప్పినందుకు సంతోషంగా ఉంది. బాలీవుడ్​లో ఏడాదికి దాదాపు 210 చిత్రాలు వస్తున్నాయి. మొత్తం 52 వారాల్లోనే వీటన్నింటిని విడుదల చేయాలి. రెండు, మూడు సినిమాల మధ్య ఇలాంటి పోటీ​ వస్తుంది".
-అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ హీరో

రోహిత్ శెట్టి​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సూర్యవంశీ' చిత్రంలో అక్షయ్​ పోలీస్​ అధికారిగా కనిపించనున్నాడు. 2010లో వచ్చిన 'తీస్​మార్​ ఖాన్​' తర్వాత మరోసారి కత్రినా కైఫ్​తో జోడీగా రానున్నాడీ 51 ఏళ్ల స్టార్​ హీరో.

సూర్యవంశీ చిత్రానికి చిక్కులు తప్పినా.. మరో సినిమాకు అక్షయ్ తిప్పలు ఎదుర్కోనున్నాడు. ఈ హీరో నటించిన 'బచ్చన్ పాండే' వచ్చే ఏడాది క్రిస్​మస్​కి విడుదలకానుంది. అదే రోజు ఆమిర్​ నటిస్తోన్న 'లాల్​ సింగ్​ చద్దా', అజయ్​ దేవగణ్​-రణ్​బీర్​ కపూర్​ మల్టీస్టారర్​గా రూపొందుతోన్న ఓ సినిమా విడుదల కానున్నాయి. మరి ఈ మూవీ కోసం అక్షయ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details